Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తె వివాహానికి తెలంగాణ గవర్నర్‌ను ఆహ్వానించిన అలీ

Webdunia
గురువారం, 10 నవంబరు 2022 (10:54 IST)
తెలుగు హాస్య నటుడు అలీ తన కుమార్తె వివాహాన్ని గ్రాండ్‌గా చేయనున్నారు. ఇందుకోసం పలువురు సినీ రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించిన ఆయన తాజాగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్‌ను ఆహ్వానించారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో ఆమెను కలుసుకున్నారు. 
 
ఈ సందర్భంగా అలీ మీడియాతో మాట్లాడుతూ, తన కుమార్తె ఫాతిమి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించాలని గవర్నర్‌ను కోరినట్టు చెప్పారు. తమతో గవర్నర్ ఎంతో అభిమానంగా మాట్లాడారని, చాలా సంతోషంగా ఉందన్నారు. 
 
తాను తమిళంలో మాట్లాడంతో ఆమె ఎంతో ఆనందానికి గురయ్యారని చెప్పారు. సినిమాలలో తనను చూడటం ద్వారా తెలుగు నేర్చుకుంటున్నానని గవర్నర్ తనతో అన్నారని, ఈ మాటలు చాలా ఆనందానికి, సంతోషానికి గురిచేశాయని చెప్పారు. 
 
మరోవైపు, అలీ తనను కలిసినట్టు గవర్నర్ తమిళిసై సూడా ట్విట్టర్‌ ఖాతాలో వెల్లడించారు. తన కుమార్తె వివాహానికి హాజరుకావాలని ఆహ్వాన పత్రిక అందజేశారని అందులో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలో పెట్రోల్ కొరత ఏర్పడిందా? కేంద్ర పెట్రోలియం మంత్రి ఏమంటున్నారు?

దళితులకు అరగుండు చేసి.. బలవంతంగా మురుగు నీరు తాగించారు.. ఎక్కడ?

కారు చక్రాల కింద నలిగిన లింగయ్య... వైఎస్ జగన్‌పై కేసు నమోదు

జగన్ కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయే దృశ్యాలు భయానకరంగా ఉన్నాయి : షర్మిల

హర్మూజ్ జలసంధి మూసివేత.. భారత్‌లో పెరగనున్న పెట్రోల్ ధరలు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments