Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుధీర్ బాబు గోదావరి బోటులో అలా కునుకేసిన వేళ.. (వీడియో)

Webdunia
బుధవారం, 7 ఏప్రియల్ 2021 (16:28 IST)
'సమ్మోహనం, వి' చిత్రాల తర్వాత మరోసారి సుధీర్ బాబు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణతో నటిస్తున్నాడు. అదే సమయంలో 'పలాస' ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో 'శ్రీదేవి సోడా సెంటర్'లో నటిస్తున్నాడు. ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్‌కు మణిశర్మ స్వరాలు అందిస్తుండగా, ఆనంది హీరోయిన్‌గా నటిస్తోంది. దీనిని విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు.
 
ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ గోదావరి పరిసర ప్రాంతాల్లో జరిగింది. దానికి సంబంధించిన ఓ చిన్న వీడియోను సుధీర్ బాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. గోదావరిలోకి మరబోటులు శబ్దం చేసుకుంటూ వెళుతుంటే... అందులో ఓ బోటులో హాయిగా సుధీర్ బాబు కునుకేస్తూ ఉన్నాడు. ఎండ వేడి ముఖం మీద పడకుండా... అసిస్టెంట్ గొడుగు పట్టుకున్నాడు. 
 
అంతే హీరోగారికి... ఆ గోదారి చల్లగాలి తగిలి మంచి కునుకు పట్టేసినట్టుగా ఉంది. నిత్యం షూటింగ్స్‌తో బిజీగా ఉండే సినీజీవులకు కరువు అనేది ఏదైనా ఉందంటే అది కంటి నిద్ర మాత్రమే. దానిని ఇలా మరపడవ మీద సుధీర్ బాబు తీర్చుకోవడంలో వింతేం ఉంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

బాలికలతో వ్యభిచారం.. డీఎస్పీ సహా 21 మంది అరెస్టు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments