Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : బేగంపేట్‌లో మొక్కలు నాటిన అమీర్ ఖాన్

Webdunia
ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (16:16 IST)
తెరాస ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ పాల్గొన్నారు. ఇందులోభాగంగా ఆయన హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయంలో మొక్కలు నాటారు. 
 
తెరాస రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించగా, ఇది నిర్విఘ్నంగా కొనసాగుతూ వస్తోంది. ఇందులో అనేక ప్రముఖులు పాల్గంటున్నారు. 
 
ఈ క్రమంలో ఆదివారం బేగంపేట ఎయిర్‌పోర్టులో అమీర్ ఖాన్ మొక్కలు నాటారు. హైదరాబాద్ చేరుకున్న మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్, తన లాల్ సింగ్ చద్ధా మూవీలోని సహనటుడు అక్కినేని నాగచైతన్య, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌తో కలిసి మొక్కలు నాటారు.
 
ఈ సందర్భంగా అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎన్నో ఛాలెంజ్‌లను మనం చూసా గానీ.. మొక్కలు నాటాలనే అద్భుతమైన ఛాలెంజ్‌ను అందరికీ అందించిన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. 
 
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అలాగే వాటిని సంరక్షించాలని సూచించారు. అప్పుడే మన భవిష్యత్ తరాలకు మంచి జీవనాన్ని అందించినవారమవుతామని చెప్పారు. దీన్ని ఒక కార్యక్రమంగా కాకుండా.. నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments