Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : బేగంపేట్‌లో మొక్కలు నాటిన అమీర్ ఖాన్

Webdunia
ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (16:16 IST)
తెరాస ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ పాల్గొన్నారు. ఇందులోభాగంగా ఆయన హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయంలో మొక్కలు నాటారు. 
 
తెరాస రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించగా, ఇది నిర్విఘ్నంగా కొనసాగుతూ వస్తోంది. ఇందులో అనేక ప్రముఖులు పాల్గంటున్నారు. 
 
ఈ క్రమంలో ఆదివారం బేగంపేట ఎయిర్‌పోర్టులో అమీర్ ఖాన్ మొక్కలు నాటారు. హైదరాబాద్ చేరుకున్న మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్, తన లాల్ సింగ్ చద్ధా మూవీలోని సహనటుడు అక్కినేని నాగచైతన్య, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌తో కలిసి మొక్కలు నాటారు.
 
ఈ సందర్భంగా అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎన్నో ఛాలెంజ్‌లను మనం చూసా గానీ.. మొక్కలు నాటాలనే అద్భుతమైన ఛాలెంజ్‌ను అందరికీ అందించిన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. 
 
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అలాగే వాటిని సంరక్షించాలని సూచించారు. అప్పుడే మన భవిష్యత్ తరాలకు మంచి జీవనాన్ని అందించినవారమవుతామని చెప్పారు. దీన్ని ఒక కార్యక్రమంగా కాకుండా.. నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kulgam Encounter: జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం (video)

Nara Lokesh: ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. పాఠశాలల్లో ఇకపై రాజకీయాలు వుండవు

Sheep Scam: గొర్రెల పెంపకం అభివృద్ధి పథకంలో అవినీతి.. 33 జిల్లాల్లో రూ.1000 కోట్లకు పైగా నష్టం

Say No To Plastic: ఏపీ సెక్రటేరియట్‌లో ప్లాస్టిక్‌కు నో.. ఉద్యోగులకు స్టీల్ వాటర్ బాటిల్

హనీమూన్‌లో భర్త తాగుబోతు అని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన వివాహిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments