Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలీవుడ్ లడ్డూకు భలే డిమాండ్ - గతం కంటే రూ.1.30 లక్షలు అధికం

Advertiesment
Balapur Laddu
, ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (10:47 IST)
హైదరాబాద్ నగరంలో బాలాపూర్ లడ్డూకు భలే గిరాకీ ఏర్పడింది. ఫలితంగా గత యేడాది కంటే ఈ లడ్డూ ధర రూ.1.30 లక్షలు అధికంగా పలికింది. కిందటేడాది కరోనా వైరస్ కారణంగా లడ్డూ వేలం పాటలు నిర్వహించలేదు. 2019లో రూ.17.60 లక్షల ధర పలుకగా, ఈ యేడాది ఈ లడ్డూ ధర రూ.18.90 లక్షలు పలికింది. 
 
తాజాగా జరిగిన వేలంపాటలో నాదర్‌గుల్‌కు చెందిన మర్రి శశాంక్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ కడప ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్‌తో కలిసి బాలాపూర్‌ గణేశుని లడ్డూని దక్కించుకున్నారు. 2019లో రూ.17.6 లక్షలకు కొలను రాంరెడ్డి సొంతం చేసుకున్నారు. గతేడాది కరోనా కారణంగా లడ్డూ వేలం పాట రద్దయింది.
 
ఇరు రాష్ట్రాల ప్రజలకు సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్‌ అన్నారు. శశాంక్‌ రెడ్డితో కలిసి లడ్డూని దక్కించుకున్నట్లు చెప్పారు. ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డికి లడ్డూని కానుకగా అందిస్తామన్నారు. 
 
తెలుగు రాష్ట్రాల ప్రజలకు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, కొలను రాంరెడ్డి హాజరయ్యారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిస్ సింగపూర్‌గా తెలుగు సంతతి యువతి