Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా-లో మహిళల ర‌క్ష‌ణ కోసం సునీత కృష్ణన్ ఆధ్వ‌ర్యంలో సెల్ ఏర్పాటుః మంచు విష్ణు

Webdunia
శుక్రవారం, 22 అక్టోబరు 2021 (18:53 IST)
Sunita Krishnan, Manchu Vishnu
మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అధ్య‌క్షునిగా ప‌ద‌వీ చేప‌ట్టిన త‌ర్వాత మంచు విష్ణు ఓ కొత్త ప్ర‌యోగానికి శ్రీ‌కారం చుట్టారు. ఇప్ప‌టివ‌ర‌కు అందులోని మ‌హిళా స‌భ్య‌ల్లో కొంద‌రిని మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం ఓ క‌మిటీని ఏర్పాటు చేసేవారు. కానీ తొలిసారిగా పద్మశ్రీ అవార్డు గ్రహీత, మానవతావాది, నిర్మాత అయిన‌ సునీత కృష్ణన్ ఆధ్వ‌ర్యంలో ఓ సెల్‌ను ఏర్పాటు చేశారు.

ఈమె దేశంలో అభాగ్యులైన ఎంతోమంది మ‌హిళ‌ల‌కు అండ‌గా నిలిచి మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఆమె ఒరిస్సాలోని మయూర్ బంజ్ జిల్లా, పరిసర ప్రాంతాల్లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా, వాస్తవికతకు దగ్గరగా 'దహిణి' చిత్రాన్ని రూపొందించారు.
 
ఈ విష‌యాన్ని శుక్ర‌వారంనాడు మంచు విష్ణు తెలియ‌జేస్తూ ఓ పోస్ట్ పెట్టాడు. మా- బ‌లంగా మ‌రింత  జవాబుదారీగా వుండాల‌ని ఈ నిర్ణ‌యం తీసుకున్నాం. అందుకే  మహిళా సాధికారత  అండ్  గ్రీవెన్స్ సెల్ ను (డ‌బ్ల్య‌.ఇ.జి.సి.) విశాఖ మార్గదర్శకత్వానికి అనుగుణంగా ఏర్పాటు చేశాం. ఇందుకు చాలా సంతోషిస్తున్నాం. ఆమె మా గౌర‌వ స‌ల‌హాదారుగా మా క‌మిటీకి సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. ఈ క‌మిటీలో న‌లుగురు మ‌హిళ‌లు, ఇద్ద‌రు పురుషులు వుంటారు. త్వ‌ర‌లో ఆ వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం. మా ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న అభివృద్ధిలో మొద‌టి మెట్టుగా భావిస్తున్నాం. మ‌హిళల ర‌క్ష‌ణ‌కోసం మా క‌ట్టుబడి వుంద‌ని మంచు విష్ణు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments