Webdunia - Bharat's app for daily news and videos

Install App

దంగల్ జైరా పబ్లిసిటీ కోసం ఏడ్చిందా.? అశోక్ గజపతి రాజు అలా అన్నారే?

దంగల్ నటి జైరా సంచలన ఆరోపణలు చేస్తూ, ఓ వ్యక్తి తనను విమానంలో తాకాడని, మెడ, వీపు నిమిరాడని ఏడుస్తూ సెల్ఫీ వీడియోను తీసి పోస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే జైరా ఆరోపణలను సదరు వ్యక్తి భార్య ఖండించింది.

Webdunia
గురువారం, 14 డిశెంబరు 2017 (10:57 IST)
దంగల్ నటి జైరా సంచలన ఆరోపణలు చేస్తూ, ఓ వ్యక్తి తనను విమానంలో తాకాడని, మెడ, వీపు నిమిరాడని ఏడుస్తూ సెల్ఫీ వీడియోను తీసి పోస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే జైరా ఆరోపణలను సదరు వ్యక్తి భార్య ఖండించింది. తన భర్త అలాంటి వాడు కాదని కూడా చెప్పింది. సాక్షులు కూడా జైరాను సచ్ దేవా అనే వ్యక్తి వేధించలేదని చెప్తున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సచ్‌దేవా అమాయకుడని ఆ సాక్షి చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 
 
తానూ వారి వరుసలోనే కూర్చున్నానని, సచ్‌దేవా ఆ నటిని లైంగికంగా వేధించలేదని, అసభ్యంగా ప్రవర్తించలేదని సాక్షి చెప్పుకొచ్చాడు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు స్పందిస్తూ.. విమానాల్లో ప్రయాణికుల భద్రత తమకు అత్యంత కీలకమని, ఎక్కడైనా ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటే తక్షణం చర్యలు తీసుకుంటున్నామన్నారు. 
 
పబ్లిసిటీ కోసం కొందరు సెలెబ్రిటీలు విమానాల్లో తమకేదో జరిగిపోతోందని ఆరోపిస్తున్నారని అశోక్ గజపతి రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విమానాల్లో వేధింపులు అత్యంత అరుదని, ఏ తప్పు చేసినా శిక్ష తీవ్రంగా ఉంటుందన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసునని చెప్పారు. దీంతో ఈ వ్యవహారంలో జైరా అసత్యాలు చెప్పాల్సిన అవసరం ఏముందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వేధింపులు జరిగిన మాట నిజమేనని బాధితురాలు చెప్తుంటే సాక్షులు, కేంద్ర మంత్రి అశోక్ గజపతి లాంటి వారు కూడా ఆమెను వ్యతిరేకంగా కామెంట్లు ఇవ్వడంపై మండిపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)

కాంట్రాక్ట్ ఉద్యోగిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే - ఎలా దాడిచేస్తున్నాడో చూడండి (Video)

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

నా భర్తతో పడుకో, నా ఫ్లాట్ బహుమతిగా నీకు రాసిస్తా: పని మనిషిపై భార్య ఒత్తిడి

పురుషులకు వారానికి రెండు మద్యం బాటిళ్లు ఇవ్వాలి : జేడీఎస్ ఎమ్మెల్యే డిమాండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం