ముమైత్ ఖాన్‌: వెండితెర పైనుంచి బుల్లి తెరపైకి జారి పడింది

Webdunia
శనివారం, 20 ఫిబ్రవరి 2021 (19:27 IST)
ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే అంటూ యువతను ఉర్రూతలూగించింది ముమైత్ ఖాన్. ఆ పాట మహేష్ బాబు కన్నా ముమైత్ ఖాన్‌కు మంచి పేరు తెచ్చి పెట్టింది. పోకిరి సినిమాను బ్లాక్‌బస్టర్ హిట్ చేసింది. అయితే ఆ తరువాత ఎన్ని పాటలకు నృత్యం చేసినా ముమైత్ ఖాన్‌కు పెద్దగా మైలేజ్ రాలేదు.
 
కానీ డిక్టేటర్ సినిమాలో ఒక గీతాన్ని బాలక్రిష్ణతో ఆలపిస్తూ కాలు జారి గోడను కొట్టుకుని ముమైత్ తలకు పెద్ద దెబ్బే తగిలింది. ఇక ఆమె కోలుకోవడానికి మూడేళ్ళకు పైగా పడుతుందని వైద్యులు స్పష్టం చేశారు. తలలో బ్లీడింగ్ ఫుల్లుగా రావడంతో ఇక ముమైత్ ఖాన్ బతకడం కూడా కష్టమే అనుకున్నారు బంధువులు.
 
అయితే దేవుడు దయ వల్ల తను మూడు నుంచి నాలుగు నెలల్లోనే కోలుకున్నానని ముమైత్ ఖాన్ ఆ తరువాత చెప్పారు. అడపాదడపా అప్పుడప్పుడు చిన్నచిన్న డ్యాన్స్ ఎపిసోడ్లలో ఆమె చేస్తూ వస్తున్నారు. ఈ మధ్య ఆమె కొన్ని ఎపిసోడ్‌లలో ఏడుస్తూ కనిపించారు కూడా. ప్రస్తుతానికి బుల్లితెరలో డ్యాన్సు షోలకి జడ్జిగా వ్యవహరిస్తున్న ముమైత్, వెండితెరపైన అవకాశాలు ఎప్పుడు వస్తాయోనని చూస్తోందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డుపై వేగంగా కదిలే స్కూటర్ హ్యాండిల్ వదిలేసి కూర్చుని ఫీట్స్, వీడియో

సినీ రంగంలో తాగుబోతులు, తిరుగుబోతులే వుంటారు: సినీ పరిశ్రమపై పాశం యాదగిరి దారుణ వ్యాఖ్యలు

సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుల్.. కాంట్రాక్ట్ ఉద్యోగి సేఫ్

విద్యుత్ ట్రాన్స్‌మిషన్ సత్తాపై ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ AI ఆశలు

సరస్వతి పుష్కరాలకు టీఎస్‌టీడీసీ ప్రత్యేక ప్యాకేజీ పర్యటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలు

కిడ్నీ సమస్య వుందని తెలిపే సంకేతాలు

శస్త్రచికిత్స లేకుండానే 4 ఏళ్ల చిన్నారి గుండెలో రంధ్రాన్ని విజయవంతంగా మూసిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments