Webdunia - Bharat's app for daily news and videos

Install App

శేఖర్ కమ్ములకు ఏమైంది.. ఆ సమస్యతో బాధపడుతున్నారా?

Webdunia
శనివారం, 12 అక్టోబరు 2019 (16:40 IST)
సహజ దర్శకుడు శేఖర్ కమ్ముల. అన్ని వర్గాల ప్రేక్షకులను దగ్గర చేసే సినిమాలు చేయడం శేఖర్ కమ్ములకు మాత్రమే తెలుసు. ఇది తెలుగు సినీపరిశ్రమలో ఎవరైనా ఠక్కున చెబుతారు. అయితే ఫిదా సినిమా తరువాత శేఖర్ కమ్ముల కాస్త గ్యాప్ ఇచ్చి నాగ చైతన్యతో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. 
 
ఈ సినిమాలో ఫిదా బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్. నాగచైతన్య సరసన నటిస్తుండటంతో అభిమానులు సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అన్న ఆసక్తిలో ఉన్నారు. అయితే సినిమాను శేఖర్ కమ్ముల డిసెంబర్‌లో రిలీజ్ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. షూటింగ్ మొత్తం విదేశాల్లో వేగంగా జరుగుతోంది.
 
కానీ గత వారంరోజుల నుంచి శేఖర్ కమ్ముల వైరల్ ఫీవర్‌తో తీవ్రంగా బాధపడుతున్నారట. ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుని మళ్ళీ షూటింగ్‌కు వచ్చినా ఆయన దానిపై దృష్టి పెట్టలేకపోతున్నారట. దీంతో సినిమా ఆలస్యమయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు సినిమాను వచ్చే సంవత్సరం జనవరి నెలలోనే విడుదల చేసేందుకు కూడా సినిమా యూనిట్ సిద్థమవుతోందని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments