Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్‌ బాబు డైరెక్టర్ ఆఖరికి వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడా?

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (14:55 IST)
సూపర్ స్టార్ మహేష్‌ బాబు కెరీర్లో మరిచిపోలేని సినిమాల్లో మహర్షి ఒకటి. ఈ సినిమా మహేష్‌ బాబు 25వ చిత్రం. ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి తెరకెక్కించారు. ఈ మూవీకి మహేష్ బాబుకి కమర్షియల్ సక్సెస్ అందించడంతో పాటు మంచి పేరు కూడా తీసుకువచ్చింది. దీంతో వంశీ పైడిపల్లితో మహేష్ మరో సినిమా చేయాలనుకున్నారు.
 
కథ రెడీ చేసుకో మళ్లీ కలిసి సినిమా చేద్దాం అన్నారు మహేష్‌. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత వంశీ పైడిపల్లితో సినిమా ఎనౌన్స్ చేస్తారనుకున్నారు. అయితే... వంశీ చెప్పిన కథ నచ్చకపోవడంతో మహేష్ పరశురామ్‌తో సినిమాని ఎనౌన్స్ చేసాడు. ఆ తర్వాత వంశీ పైడిపల్లి రామ్ చరణ్‌తో సినిమా చేయాలనుకున్నారు.
 
ఇటీవల చరణ్‌కి కథ చెప్పారు కానీ... అక్కడ కూడా స్టోరీ సరిగా లేకపోవడం వలన ప్రాజెక్ట్ సెట్ కాలేదు. దీంతో వంశీ పైడిపల్లి మళ్లీ మహేష్‌ చెంతకే వెళ్లారట. మళ్లీ మహేష్ బాబుతో ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నారట. అయితే... ఈసారి చేసేది సినిమా కాదు. వెబ్ సిరీస్ అని సమాచారం. అది కూడా మహేష్‌ బాబుతో కాదండోయ్ .. మహేష్ బ్యానర్లో వంశీ పైడిపల్లి వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
 
ఈ వెబ్ సిరీస్ తర్వాత మహేష్ బాబుతో సినిమా చేస్తాడట. మొత్తానికి మహర్షి అనే బ్లాక్‌బస్టర్ సాధించినా... వంశీ పైడిపల్లి సినిమా చేయడానికి చాలా టైమ్ పట్టేలా ఉంది. ఆఖరికి వంశీ పైడిపల్లి సినిమా ఎవరితో సెట్ అవుతుందో..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments