Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వంశీ పైడిపల్లికి మరో షాక్, ఇంతకీ ఏమైంది?

వంశీ పైడిపల్లికి మరో షాక్, ఇంతకీ ఏమైంది?
, శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (18:00 IST)
డైరెక్టర్ వంశీ పైడిపల్లి మహర్షి సినిమా తర్వాత మళ్లీ మహేష్ బాబుతోనే సినిమా చేయాలనుకున్నారు. మహేష్‌ కూడా వంశీతో మరో సినిమా చేస్తానన్నారు. వీరిద్దరి కాంబినేషన్లో మూవీని దిల్ రాజు నిర్మించాలనుకున్నారు. అయితే... సరైన స్టోరీ సెట్ కాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఆగింది. ఆ తర్వాత నుంచి వంశీ పైడిపల్లి కథ రెడీ చేస్తూనే ఉన్నారు కానీ.. సరైన ప్రాజెక్ట్ సెట్ కావడం లేదు.
 
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌‌తో సినిమా చేయాలనుకున్నారు. కథ రెడీ చేసారు.. రీసెంట్‌గా చరణ్‌కి నెరేషన్ ఇచ్చారు. అయితే... కథ విని చరణ్ ఓకే చెప్పలేదట. దీంతో వంశీ పైడిపల్లికి మరో షాక్ తగిలింది. స్టార్ హీరోల్లో ఒక్క చరణ్ మాత్రమే ఆర్ఆర్ఆర్ తర్వాత చేయబోయే సినిమాని కన్ఫర్మ్ చేయలేదు. మిగిలిన హీరోలందరూ ప్రాజెక్ట్ ఓకే చేసుకుని షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు.
 
అందుచేత ఇప్పుడు వంశీ ముందున్న తక్షణ కర్తవ్యం చరణ్‌ కోసం మరో కథను రెడీ చేయడమే. అయితే.. చరణ్‌ దగ్గర గట్టి పోటీ ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, గౌతమ్ తిన్ననూరి, వెంకీ కుడుములతో చరణ్ తదుపరి చిత్రం విషయమై చర్చిస్తున్నట్టు సమాచారం. మరి.. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్‌తో సినిమా చేసే ఛాన్స్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోనూ సూద్ ఏం చేయబోతున్నాడు.. స్టూడెంట్స్ కోసం బిగ్ అనౌన్స్‌మెంట్?