Webdunia - Bharat's app for daily news and videos

Install App

"పుష్ప పార్ట్ 2" థియేట్రికల్ రైట్స్.. రూ.200 కోట్లు డిమాండ్

Webdunia
మంగళవారం, 2 జనవరి 2024 (12:43 IST)
అల్లు అర్జున్ పుష్ప పార్ట్ వన్ 2021లో భారీ కలెక్షన్లు సాధించింది. అప్పటి నుండి ప్రజలు దాని రెండవ భాగం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్‌లో పుష్ప 2 ఒకటి. బహుశా అందుకే నిర్మాతలు ఈ సినిమా రైట్స్‌ని ఇంత ఖర్చు పెట్టి అమ్మాలని అనుకుంటున్నారు.
 
సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప-2 పాన్ ఇండియా చిత్రం. ఈ ఏడాది మధ్యలో ఈ సినిమా విడుదల కానుంది. తొలి భాగం క్రేజ్ చూస్తుంటే "పుష్ప పార్ట్ 2" కూడా భారీ వసూళ్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు. 
 
'పుష్ప 2' థియేటర్ హక్కుల కోసం మేకర్స్ చాలా డబ్బు డిమాండ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ కోసం మేకర్స్ రూ.200 కోట్లు డిమాండ్ చేశారని వార్తలు వస్తున్నాయి. 
 
ఇంతకు ముందు రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ మాత్రమే ఇంత ఎక్కువ మొత్తానికి అమ్ముడుపోయింది. ప్రభాస్ 'సలార్' థియేట్రికల్ రైట్స్‌కు కేవలం 160 కోట్లు మాత్రమే వచ్చాయి. 
 
ఆంధ్రప్రదేశ్ నుండి కొనుగోలుదారులు అంత పెద్ద రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. రూ.200 కోట్లు అంటే చిన్న మొత్తం కాదు. రూ.100 కోట్లకు డీల్ ఖరారు చేయాలనుకుంటున్నారు. మరి ఈ డీల్ ఎంత మొత్తానికి ఖరారు అవుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments