Webdunia - Bharat's app for daily news and videos

Install App

''సాహో''లో రాయలసీమ అమ్మాయిగా శ్రద్ధా కపూర్.. ఫిదాకు పోటీగా సీమ యాసలో?

బాహుబలి సినిమాకు తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ తదుపరి చిత్రంగా యూవీ క్రియేషన్స్ బ్యానర్లో 'సాహో' రూపొందుతోంది. సుజీత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా శ్రద్ధా కపూర్ నటిస్తోంది. ఈ సినిమాలో శ్రద

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (11:32 IST)
బాహుబలి సినిమాకు తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ తదుపరి చిత్రంగా యూవీ క్రియేషన్స్ బ్యానర్లో 'సాహో' రూపొందుతోంది. సుజీత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా శ్రద్ధా కపూర్ నటిస్తోంది. ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ రెండు విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఒక రోల్‌లో రాయలసీమ అమ్మాయిగా సంప్రదాయబద్ధంగా.. విలేజ్ అమ్మాయిగా కనిపిస్తే.. మరో షేడ్‌లో మోడ్రన్ అమ్మాయిగా కనిపించనుందట.
 
ఈ కారణంగానే ప్రభాస్‌కి శిక్షణ ఇస్తోన్న హాలీవుడ్ స్టంట్ మాస్టర్, శ్రద్ధా కపూర్‌కి కూడా ట్రైనింగ్ ఇస్తున్నాడట. ఈ పాత్రలో శ్రద్ధా కపూర్ చాలా కొత్తగా కనిపిస్తుందని టాక్ వస్తోంది. ఈ చిత్రంతో శ్రద్ధా కపూర్ తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చేస్తుందని సినీ యూనిట్ భావిస్తోంది. ఈ సినిమాతో తెలుగులో శ్రద్ధా కపూర్‌కి మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్సుందని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు. ఫిదాలో తెలంగాణ యాసను హీరోయిన్‌చేత పలికించిన మేకర్స్... ప్రస్తుతం శ్రద్ధా కపూర్ ‌ద్వారా రాయలసీమ యాసను పలికించేందుకు సిద్ధమవుతున్నారట. ఇక బాలీవుడ్ నటీనటులు ఎక్కువగా కనిపించే ఈ సినిమా, తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో విడుదల కానుంది.
 
ఇకపోతే.. ప్రభాస్‌ హీరోగా నటించే సాహో సినిమాకు సంబంధించి రోజుకో ఆసక్తికరమైన వార్త బయటికొస్తోంది. తాజాగా అన్నవరం, ఖతర్నాక్‌ సినిమాల్లో నటించి, ఇటీవలే ‘మన్యం పులి’లో మోహన్‌లాల్‌ మామగా ఆకట్టుకొని తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన మలయాళ నటుడు లాల్‌ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో వేసిన ఓ సెట్‌లో సాహో షూటింగ్‌ జరుగుతోంది. ప్రభాస్‌తోపాటు, లాల్‌ కూడా తాజా షెడ్యూల్‌లో పాలుపంచుకుంటారని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments