టాలీవుడ్‌లో మకుటంలేని మహారాజు ఎవరు? రవితేజ చెప్పిన ఆన్సర్ ఏంటి?

Webdunia
గురువారం, 30 జనవరి 2020 (11:56 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్రహీరోల్లో చిరంజీవి ఒకరు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా ఉన్నారు. అలాంటి చిరంజీవి గురించి మాస్ మహాజారాగా గుర్తింపు పొందిన రవితేజ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 
 
అరవై యేళ్ళ వయస్సులో కూడా కుర్ర హీరోల‌తో పోటీపడుతూ చిత్రాలు చేస్తున్న చిరంజీవి అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ సొంతం చేసుకున్నారు. త్వ‌ర‌లో త‌న 152వ సినిమ‌తో ప‌ల‌క‌రించ‌నున్నారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. 
 
అలాంటి చిరంజీవిపై మరో టాలీవుడ్ హీరో ర‌వితేజ ప్ర‌శంస‌లు కురిపించారు. రవితేజ నటించిన తాజా చిత్రం డిస్కోరాజా. ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ చిత్రంలో నేనంటే 35 ఏళ్ళు ఐస్‌లో గడ్డ క‌ట్టేసేలా ఉన్నాను. ఆయ‌నేంటి ఇంకా అలానే ఉన్నారు అని ర‌వితేజ‌.. వెన్నెల కిషోర్‌తో చెబుతాడు. 
 
దీనికి వెన్నెల కిషోర్ ఐస్‌లో కాదు ఫ్యాన్స్ గుండెల్లో ఉన్నాడ‌ని అంటాడు. దీనికి సంబంధించిన డైలాగ్ వీడియోని చిత్ర బృందం విడుద‌ల చేసింది. ఈ వీడియో నెటిజ‌న్స్‌ని ఆక‌ట్టుకుంటుంది. వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన డిస్కోరాజా చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యం సాధించ‌గా, ఈ చిత్రం మ‌రిన్ని వ‌సూళ్ళు రాబ‌ట్టేందుకు మేక‌ర్స్ వినూత్న ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజస్థాన్‌లో ప్రశ్నపత్రం లీక్ : నీట్ ప్రవేశ పరీక్ష రద్దు

విజయ్ పార్టీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు - బల పరీక్షలో ఓటు వేయడానికీ వీల్లేదంటూ ఆదేశం

Narahari: పోలీసుల ముందు భార్యతో లొంగిపోయిన మావో కీలక నేత పసునూరి నరహరి

స్వీపర్‌పై జర్నలిస్టు లైంగిక వేధింపులు.. ఆత్మరక్షణ కోసం నాలుకను కొరికేసింది..

717 ప్రభుత్వ టాస్మాక్ మద్యం విక్రయ కేంద్రాలు బంద్.. విజయ్ ఆదేశాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహాన్ని అదుపులో వుంచే ఆయుర్వేద చిట్కా

ప్రాణాలు నిలబడుతున్నా... సాధారణ జీవితం కరువే

క్యారెట్లు ఎందుకు తినాలో తెలుసా?

డయాబిటీస్, ఊబకాయం పోషణ రంగంలో మరింత శక్తివంతం చేసుకున్న డాక్టర్ రెడ్డీస్, నెస్లే హెల్త్ సైన్స్

10 తాజా లేత ఆకులను నీటిలో 5 నిమిషాలు నానబెట్టి ఆ నీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments