Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో '2.0' భారీ రిలీజ్.. 16 వేల థియేటర్స్‌లో స్క్రీనింగ్

'బాహుబలి ది బిగినింగ్' సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శక ధీరుడు రాజమౌళి 'బాహుబలి ది కంక్లూజన్'తో టాలీవుడ్ ఇండస్ట్రీని ప్రపంచానికే పరిచయం చేశాడు. ఓ తెలుగు సినిమా ఇలాంటి ఘనత సాధిస్తుందని ఎవరు

Webdunia
ఆదివారం, 24 సెప్టెంబరు 2017 (15:54 IST)
'బాహుబలి ది బిగినింగ్' సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శక ధీరుడు రాజమౌళి 'బాహుబలి ది కంక్లూజన్'తో టాలీవుడ్ ఇండస్ట్రీని ప్రపంచానికే పరిచయం చేశాడు. ఓ తెలుగు సినిమా ఇలాంటి ఘనత సాధిస్తుందని ఎవరు ఎప్పుడు ఊహించలేదు కూడా. ఏ ఇండియన్ సినిమా సాధించని రికార్డు బాహుబలి 2 సాధించి అందరు ముక్కున వేలేసుకునేలా చేసింది. ఏకంగా రూ.2 వేల కోట్ల‌ు వ‌సూళ్ళు సాధించింది.
 
ఈ క్రమంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 2.0 చిత్రం చైనాలో రిలీజ్ కానుంది. నిజానికి చైనాలో భారతీయ సినిమాలను రిలీజ్ చేయాలంటే అందుకు ఒక ప్రాతిపదిక ఉంటుంది. ఒక యేడాదికి ఇన్ని భారతీయ సినిమాలను మాత్రమే అక్కడ విడుదల చేయాలంటూ అక్కడి ప్రభుత్వం అనుమతినిస్తుంది. ఆ రేషన్‌లో అక్కడ విడుదలైన 'దంగల్' వసూళ్ల పరంగా ఎలాంటి రికార్డును సృష్టించిందో తెలిసిందే. ఆ తర్వాత రజనీ తాజా చిత్రం '2.0' కి అక్కడ ప్రదర్శించడానికి అనుమతి లభించింది.
 
వచ్చే ఏడాది ఈ సినిమాను అక్కడ విడుదల చేయడానికి ముందుగానే బెర్త్‌ను ఖరారు చేసుకున్నారు. చైనాలోను రజనీకాంత్ కి పెద్ద సంఖ్యలోనే ఫ్యాన్స్ ఉన్నారు. అందువలన ఈ సినిమాను అక్కడ దాదాపు 16 వేల థియేటర్స్‌లో విడుదల చేయనున్నట్టు సమాచారం. ఐ మ్యాక్స్ వెర్షన్‌తో పాటు త్రీడీ వెర్షన్‌ను కూడా విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా అక్కడ ఏ రేంజ్‌లో దూసుకుపోతుందో .. ఏ స్థాయి వసూళ్లను రాబడుతుందో వేచి చూడాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

థ్యాంక్యూ చిన్నన్నయ్యా.. మీరిచ్చిన పుస్తకమే రాజకీయ చైతన్యం కలిగించింది : పవన్

Onam Dance: కేరళలో ఓనం సంబరాల్లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి వ్యక్తి మృతి (video)

ఓనం వేడుకల్లో విషాదం.. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి మృతి చెందిన ఉద్యోగి

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం - ఉత్తర కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన

కుమార్తెపై బహిష్కరణ వేటు వేసిన తండ్రి కేసీఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments