Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.4 కోట్లిస్తే వస్తానంటున్న 'జిగేల్ రాణి'

Webdunia
గురువారం, 19 మార్చి 2020 (08:43 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో పట్టిందల్లా బంగారంగా మారిన హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. ఈ భామ నటించిన ప్రతి చిత్రం సూపర్ హిట్టే. గత యేడాదిలాగానే ఈ యేడాది కూడా ఈ భామకు బాగా కలిసివచ్చింది. ఫలితంగా టాప్ గేర్‌లో దూసుకెళుతోంది. వరుస అవకాశాలతో బిజీగా గడుపుతోంది. దీంతో తన పారితోషికాన్ని కూడా అమాంతం పెంచేసింది. 
 
గత సంక్రాంతికి విడుదలైన అల.. వైకుంఠపురంలో చిత్రంతో ఈ భామ క్రేజ్‌ ఆకాశానికి చేరిపోయింది. ఈ చిత్రం కోసం 2 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్న ఈ అందాలభామ ఇప్పుడు తెలుగులో రూ.3 కోట్లు డిమాండ్ చేస్తోందట. 
 
ప్రస్తుతం తెలుగులో ప్రభాస్‌ సరసన ‘జాన్‌', అఖిల్‌తో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌' చిత్రంలో నటిస్తున్న పూజాకు తెలుగులోనే కాదు బాలీవుడ్‌లో కూడా మంచి పాపులారిటీ సంపాందించుకుంది.
 
ఇటీవల ‘హౌజ్‌ఫుల్‌-4’ చిత్రంలో బాలీవుడ్‌ జనాలను ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు సల్మాన్‌ఖాన్‌తో నటించనున్న ‘కబీ ఈద్‌ కబీ దివాళీ’ చిత్రానికి రూ.4 కోట్ల పారితోషికం డిమాండ్‌ చేసిందట. 
 
ఇక పూజా హెగ్డేకు వున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆ చిత్ర నిర్మాత సాజిద్‌ నడియాలా కూడా ఆమె డిమాండ్‌కు అంగీకరించాడని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. గతంలో పడిన ఐటం గర్ల్ అనే ముద్రను చెరిపేసుకుంటూ ముందుకుసాగిపోతోంది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments