Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ బ్యూటీ డిమాండ్ విని నోరెళ్లబెట్టిన తమిళ నిర్మాతలు...

Webdunia
గురువారం, 4 మార్చి 2021 (18:19 IST)
తెలుగులో అగ్ర హీరోయిన్‌గా నటి పూజా హెగ్డే. ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న చిత్రాలన్నీ సూపర్ హిట్ అవుతున్నాయి. దీంతో ఈ అమ్మడు రేంజ్ ఎక్కడికో ఎదిగిపోయింది. ఈ క్రమంలో పూజా హెగ్డేకు బాలీవుడ్ మూవీలు కూడా చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. 
 
ముఖ్యంగా, దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఉద్దేశంతో రెమ్యునరేషన్ పరంగా ఈ ముద్దుగుమ్మ భారీగానే డిమాండు చేస్తోంది. తాజాగా తమిళంలో ఓ సినిమాకి ఆమె తీసుకుంటున్న పారితోషికం ఫిగర్ తెలిసిన వాళ్లు ఆశ్చర్యపోతున్నారు.
 
తన కెరీర్ తొలినాళ్లలో 'ముగమూడి' అనే తమిళ సినిమాలో కథానాయికగా నటించింది. మళ్లీ ఇప్పుడు స్టార్ హీరో విజయ్ సరసన కథానాయికగా నటించడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. 
 
ఇళయదళపతి విజయ్ తన 65వ చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రంలో కథానాయికగా పూజ హెగ్డేను ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఈ క్రమంలో ఈ చిత్రంలో నటించడానికి ఈ చిన్నది రూ.3.5 కోట్లు డిమాండ్ చేసినట్టు, చేసేదేమీలేక ఆమె అడిగినంతా ఇవ్వడానికి నిర్మాతలు ఒప్పుకున్నట్టు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో ప్రీమియర్ డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్ ఫెస్టివల్, డిజైన్ డెమోక్రసీ 2025

Nara Lokesh: ప్రధాని మోదీతో 45 నిమిషాల పాటు భేటీ అయిన నారా లోకేష్

Mumbai On High Alert: ముంబైలో 400 కిలోల ఆర్డీఎక్స్‌, వాహనాల్లో వాటిని అమర్చాం.. హై అలెర్ట్

రెండేళ్ల పాపాయిని ఎత్తుకెళ్లిన కోతుల గుంపు.. నీళ్ల డ్రమ్ములో పడేసింది.. ఆపై ఏం జరిగిందంటే?

భర్త సమోసా తీసుకురాలేదని భార్య గొడవ.. పోలీస్ స్టేషన్‌ వరకు వెళ్లింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments