Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ వరకు థియేటర్లలో బొమ్మపడటం కష్టమేనట!!

Webdunia
శనివారం, 11 ఏప్రియల్ 2020 (11:43 IST)
ప్రపంచం కరోనా గుప్పెట్లో చిక్కుకుంది. ఈ వైరస్ మహమ్మారి బారినపడకుండా ఉండేందుకు అన్ని దేశాలు కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది. అలాగే, ప్రజలు గుంపులు, గుంపులుగా చేరకూడదని ఆదేశించింది. తప్పనిసరిగా సామాజికదూరం పాటించాలని కోరుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో లాక్‌డౌన్ తర్వాత సినిమా థియేటర్లలో బొమ్మపడటం అనుమానాస్పదంగా మారింది. ఎందుకంటే.. కరోనా వైరస్ భయం ఇప్పట్లో పోయేలాలేదు. అలాంటపుడు థియేటర్లకు ప్రేక్షకుడు వచ్చేందుకు సాహసం చేయకపోవచ్చన్నది ఇండస్ట్రీ పెద్దల మాట. 
 
ముఖ్యంగా, లాక్‌డౌన్ కారణంగా సినీ ఇండస్ట్రీ బాగా దెబ్బతిన్నదని చెప్పొచ్చు. ఎక్కడి షూటింగ్‌లు అక్కడే ఆగిపోయాయి. థియేటర్లు మూతపడటంతో కొత్త సినిమాల విడుదల ఆగిపోయింది. ప్రస్తుత అమల్లో ఉన్న లాక్‌డౌన్ ఈ నెల 14వ తేదీతో ముగియనుంది. కానీ, మ‌రో రెండు వారాల పాటు లాక్‌డౌన్ కొన‌సాగే అవ‌కాశాలున్నాయ‌ని అంటున్నారు. అంటే ఒక‌వేళ ఏప్రిల్ చివ‌రి వ‌ర‌కు లాక్‌డౌన్ కొన‌సాగితే సినిమా థియేట‌ర్స్ ప‌రిస్థితేంటి? సినిమాల‌ను ఎప్పుడు? ఎలా విడుద‌ల చేసుకోవాలి? అంటూ నిర్మాత‌లు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. 
 
సోష‌ల్ మీడియాలో విన‌ప‌డుతున్న స‌మాచారం మేర‌కు ఒకవేళ లాక్‌డౌన్‌ను ఏప్రిల్ త‌ర్వాత ఎత్తేసినా! ప్రేక్ష‌కుడు థియేట‌ర్‌కు రావాలంటే ఆలోచ‌న‌లో ప‌డ‌తాడు. మాల్స్‌లో ఎక్కువ మంది గుంపులుగా చేరుతారు. అలా చేర‌డం మంచిది కాదు. కాబ‌ట్టి ప్ర‌భుత్వం థియేట‌ర్స్‌, మాల్స్‌ను వెంట‌నే ఓపెన్ చేయాల‌నుకోవ‌డం లేదని, జూన్ చివ‌రి వ‌ర‌కు థియేటర్స్‌, మాల్స్ మూత ప‌డే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి థియేట‌ర్స్, మాల్స్‌పై కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎలాంటి నిర్ణ‌యం తీసుకోనున్నాయో వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో.. వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వరరావు ఆస్తులు విలువెంతంటే?

Chandrayaan-5: చంద్రయాన్-5 కోసం కుదిరిన డీల్.. జపాన్‌తో కలిసి పనిచేస్తాం.. నరేంద్ర మోదీ

తెలుగు భాష, సంస్కృతిని పరిరక్షించడానికి సంకీర్ణ ప్రభుత్వం కట్టుబడి వుంది.. కందుల దుర్గేష్

సెక్యూరిటీ గార్డు వేతనం నెలకు రూ.10 వేలు.. రూ.3.14 కోట్లకు జీఎస్టీ నోటీసు

గోదావరి నదికి చేరుతున్న వరద నీరు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments