Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌కు మరో ఛాన్స్...

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (10:27 IST)
దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌కు తెలుగులో మరో సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ప్రస్తుతం ఆమె కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ నగరంలో సాగుతోంది. ఇపుడు మరో చిత్రంలో నటించేందుకు సమ్మతించినట్టు సమాచారం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా 'ఉప్పెన' ఫేం బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్రంలో నటించేందుకు ఆమె అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి.
 
చెర్రీ - బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కే చిత్రంలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను సంప్రదించగా, ఆమె దాదాపుగా ఓకె చెప్పినట్టు తెలుస్తుంది. అదే నిజమైతే ఆర్ఆర్ఆర్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఇద్దరు అగ్ర హీరోలైన ఎన్టీఆర్, చరణ్ సరసన నటించే అరుదైన అవకాశం వరించనుంది. చరణ్‌తో కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కే చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇందులో చెర్రీ రెండు పాత్రల్లో నటిస్తాడని, ఒక హీరోయిన్‌గా జన్వీకపూర్, మరో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్‌ను ఎంపిక చేస్తారే టాక్ వినిపిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మైదానంలోనే మృతి చెందిన యువకుడు

మానవ్ శర్మ ఆత్మహత్య కేసు: భార్య, మామను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకంటే?

ఇద్దరి పిల్లల్ని కట్టేసి మహిళపై అత్యాచారం చేసిన డ్రైవర్, కండక్టర్, క్లీనర్

షర్మిలపై రోజా ఫైర్.. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారు..

మామిడిగూడ కుగ్రామంలో నీటి కొరత.. పొలం నుంచి కుండ నీళ్లు తెచ్చేందుకు అష్టకష్టాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments