Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దుబాయ్‌లో సీమంతం జరుపుకున్న ఉపాసన?

upasana
, బుధవారం, 5 ఏప్రియల్ 2023 (17:46 IST)
మెగా పవర్ స్టార్ సతీమణి ఉపాసనకు దుబాయ్‌లో సీమంతం జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఉపాసన తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో సూటిగా చెప్పలేదు కానీ, ఒక వీడియోను షేర్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ జంట దుబాయ్‌లో విహరిస్తుంది. ఇందులోభాగంగా కుటుంబ సభ్యులు కూడా అక్కడకు చేరుకుని సీమంతం వేడుక నిర్వహించారు. 
 
పుట్టింటివాళ్లు నిర్వహించిన ఈ వేడుకలో ఉపాసన సోదరీమణులు అనుష్పాల, సింధూరిలు కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కటుుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకల్లో ఉపాసన రామచరణ్‌లు పూర్తి స్తాయిలో ఎంజాయ్ చేశారు. అపోలో గ్రూప్ అధిపతి డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి సతీమణితో పాటు పలువురు పెద్దవాళ్లు పాల్గొనగా చెర్రీ దంపతులు వారి ఆశీస్సులు తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కిరణ్‌ అబ్బరం, అతుల్యరవి మీటర్‌ తెరవెనుక ఏం జరిగిందో తెలుసా!