Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆదిపురుష్' కోసం రూ.50 కోట్ల రెమ్యునరేషన్?

Webdunia
శనివారం, 5 జూన్ 2021 (17:36 IST)
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన 'బాహుహలి' చిత్రం తర్వాత టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన  ప్రభావ్ ఇంటర్నేషనల్ స్టార్‌గా మారిపోయారు. ఈ చిత్రం తర్వాత ఆయన చసే ప్రాజెక్టులన్నీ పాన్ ఇండియా సినిమాలే. తాజాగా చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. 
 
వాటిలో ఒకటి "రాధేశ్యామ్". ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ఇదికాకాకుండా, ప్రశాంత్‌ నీల్‌తో 'సలార్'‌,  ‘తన్హాజీ’ ఫేం ఓం రౌత్‌తో "ఆదిపురుష్‌" చిత్రం షూటింగ్‌ దశలో ఉన్నాయి. ఆ తర్వాత డైరెక్టర్‌ నాగ అశ్విన్‌తో ఓ సినిమా సెట్స్‌పైకి రావాల్సి ఉంది. 
 
ఇదిలావుంటే, తాజాగా ప్రభాస్‌ "ఆదిపురుష్‌''కు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నట్లు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓం రౌత్‌ తెరకెక్కిస్తున్న ఈ మూవీని టీ-సిరీస్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తుంది. 
 
అయితే 'ఆదిపురుష్‌' కోసం టీ-సిరీస్‌ ఫిల్మ్స్‌ ప్రభాస్‌కు రూ.50 కోట్లను పారితోషికంగా ఇస్తున్నట్లు సమాచారం. పౌరాణిక నేపథ్యంలో రానున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా, కృతి సనన్‌ సీతగా నటించనుంది. ఇకపోతే, లంకేశ్వరుడు రావణుడి పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీఖాన్‌ అలరించనున్నాడు. 
 
భారీ బడ్జేట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. 2022 అగష్టు 11ను ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో థియేటర్లలోకి రానుంది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments