Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆదిపురుష్' కోసం రూ.50 కోట్ల రెమ్యునరేషన్?

Webdunia
శనివారం, 5 జూన్ 2021 (17:36 IST)
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన 'బాహుహలి' చిత్రం తర్వాత టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన  ప్రభావ్ ఇంటర్నేషనల్ స్టార్‌గా మారిపోయారు. ఈ చిత్రం తర్వాత ఆయన చసే ప్రాజెక్టులన్నీ పాన్ ఇండియా సినిమాలే. తాజాగా చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. 
 
వాటిలో ఒకటి "రాధేశ్యామ్". ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ఇదికాకాకుండా, ప్రశాంత్‌ నీల్‌తో 'సలార్'‌,  ‘తన్హాజీ’ ఫేం ఓం రౌత్‌తో "ఆదిపురుష్‌" చిత్రం షూటింగ్‌ దశలో ఉన్నాయి. ఆ తర్వాత డైరెక్టర్‌ నాగ అశ్విన్‌తో ఓ సినిమా సెట్స్‌పైకి రావాల్సి ఉంది. 
 
ఇదిలావుంటే, తాజాగా ప్రభాస్‌ "ఆదిపురుష్‌''కు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నట్లు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓం రౌత్‌ తెరకెక్కిస్తున్న ఈ మూవీని టీ-సిరీస్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తుంది. 
 
అయితే 'ఆదిపురుష్‌' కోసం టీ-సిరీస్‌ ఫిల్మ్స్‌ ప్రభాస్‌కు రూ.50 కోట్లను పారితోషికంగా ఇస్తున్నట్లు సమాచారం. పౌరాణిక నేపథ్యంలో రానున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా, కృతి సనన్‌ సీతగా నటించనుంది. ఇకపోతే, లంకేశ్వరుడు రావణుడి పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీఖాన్‌ అలరించనున్నాడు. 
 
భారీ బడ్జేట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. 2022 అగష్టు 11ను ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో థియేటర్లలోకి రానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

ఐసీయూలో పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు : ప్రధాని నరేంద్ర మోడీ

Kavitha: ఆగస్టు 4 నుండి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా: కల్వకుంట్ల కవిత

అమెరికాలో భారత సంతతి కోపైలెట్‌ చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లారు.. ఎందుకో తెలుసా?

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments