Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''రాధే శ్యామ్" మరొక సర్ప్రైజ్ ఓటీటీలో రిలీజ్.. జీగ్రూప్ భారీగా డెప్ట్ చేస్తుందా?

Advertiesment
Prabhas
, గురువారం, 3 జూన్ 2021 (17:58 IST)
బాహుబలి స్టార్ ప్రభాస్.. జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘రాధేశ్యామ్’. ఇందులో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. 1960 శాతాబ్దం నాటి వింటేజ్ ప్రేమకథ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కిస్తున్నాడు రాధకృష్ణ. 
 
ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. జూలై 30న ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనుంది చిత్రయూనిట్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న రాధేశ్యామ్ సినిమాకు సంబంధించి మరో చిన్న షెడ్యూల్ మిగిలి ఉందట.
 
ఆ ఒక్కటి కూడా రాధేశ్యామ్ రిలీజ్ డేట్ వచ్చేలోపు ఫినిష్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అసలే ఏడాదిగా వెయిట్ చేస్తున్నటువంటి రాధేశ్యామ్ ఇంకా వాయిదా పడింది. ప్రస్తుతం రాధేశ్యామ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరిదశలో ఉన్నాయట. 
 
ఇటీవలే సల్మాన్ ఖాన్ రాధే మూవీని రిలీజ్ డిజిటల్ రిలీజ్ చేసిన జీగ్రూప్ వారు రాధేశ్యామ్ బృందాన్ని కలిశారట. అయితే రాధేశ్యామ్ మేకర్స్ ఆల్రెడీ థియేట్రికల్ రిలీజ్ తో పాటు అదే సమయంలో ఓటిటి రిలీజ్ కూడా చేయాలనీ యోచిస్తున్నట్లు టాక్. థియేటర్స్ ఉన్నా కూడా డిజిటల్ రిలీజ్ చేస్తే.. ప్రేక్షకులు కూడా కరోనాను దాటి బయటికి వెళ్లరు. ఎంచక్కా ఇంట్లోనే కూర్చుని సినిమా చూస్తారు. మరి అలా చేస్తే థియేటర్స్‌కు ఎంత నష్టం వస్తుందనేది కూడా అంచనాలు వేయలేరు. ఏదేమైనా కూడా రాధే శ్యామ్ ఎలా విడుదల కానుందనే విషయంపై కొన్ని రోజుల్లోనే క్లారిటీ రానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ది ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ 2 స్ట్రీమింగ్.. సమంతకు ఫ్యాన్స్ మద్దతు