Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vijay Sethupathi: పూరీ జగన్నాథ్ స్పీడ్ పెంచాడా? రెండు సినిమాలు చేస్తున్నాడా?

దేవీ
మంగళవారం, 18 మార్చి 2025 (13:11 IST)
Puri, Nagarjuna, Vijay Sethupathi
దర్శకుడు పూరీ జగన్నాథ్ లైగర్, డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. అందుకోసం ప్రేక్షకుల అంచనాను కనిపెట్టడం కోసం కొంత గేప్ తీసుకున్నాడు. తాజా సమాచారం మేరకు ఇటీవలే అక్కినేని నాగార్జునతో ఓ సినిమా ఆరంభించాడు. అన్నపూర్ణ స్టూడియోలో నిరాడంబరంగా పూజ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిసింది.

శివమణి కాంబినేషన్ తర్వాత వీరు కలిసి చేస్తున్న చిత్రంగా చెప్పుకోవచ్చు.  ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ బేనర్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా తారాగణాన్ని ఎంపిక చేసే పనిలో వున్నారు. పూరీ తన టీమ్ ను కూడా మార్చాడు. గతంలో వున్న టీమ్ కంటే యువత ఆయన సాంకేతికవర్గంలో వున్నారు.
 
ఇదిలా వుండగా, తాజాగా తమిళ నటుడు విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇటీవలే చెన్నై వెళ్ళి ఆయనకు ఓ కథను వినిపించారనీ, అందుకు విజయ్ సమ్మతించారని తెలుస్తోంది. ఈసారి పూరీ యువ నటులను కుండా మధ్యవస్సున్న వారిని ఎంపికచేసుకుని కథలు రావడం మొదలుపెట్టారని సన్నిహితులు తెలియజేస్తున్నారు. ఈ రెండు సినిమాలలో ఓ యువ జంట వుంటుందని టాక్ కూడా వుంది.  ఈ సినిమాను కె.బి.ఎన్. ప్రొడక్షన్ సంస్థలో వెంకట్ కె. నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. వచ్చే నెలలో ఈ సినిమా పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒడిశాలో ఆస్తి వివాదం- 42 ఏళ్ల వ్యక్తికి పెట్రోల్ పోసి నిప్పంటించిన సవతి తల్లి

Pregnant Woman : గర్భిణీ స్త్రీ ఉరేసుకుని ఆత్మహత్య.. కారణం ఎవరో తెలుసా?

అల్పపీడన ప్రభావం- తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

Nandamuri Balakrishna: ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ అవతారమెత్తిన బాలకృష్ణ (video)

బాలుడిని ముళ్లపొదల్లోకి లాక్కెళ్లి లైంగిక దాడి.. అక్కడే హత్య.. వాడు మనిషేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments