Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vijay Sethupathi: పూరీ జగన్నాథ్ స్పీడ్ పెంచాడా? రెండు సినిమాలు చేస్తున్నాడా?

దేవీ
మంగళవారం, 18 మార్చి 2025 (13:11 IST)
Puri, Nagarjuna, Vijay Sethupathi
దర్శకుడు పూరీ జగన్నాథ్ లైగర్, డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. అందుకోసం ప్రేక్షకుల అంచనాను కనిపెట్టడం కోసం కొంత గేప్ తీసుకున్నాడు. తాజా సమాచారం మేరకు ఇటీవలే అక్కినేని నాగార్జునతో ఓ సినిమా ఆరంభించాడు. అన్నపూర్ణ స్టూడియోలో నిరాడంబరంగా పూజ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిసింది.

శివమణి కాంబినేషన్ తర్వాత వీరు కలిసి చేస్తున్న చిత్రంగా చెప్పుకోవచ్చు.  ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ బేనర్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా తారాగణాన్ని ఎంపిక చేసే పనిలో వున్నారు. పూరీ తన టీమ్ ను కూడా మార్చాడు. గతంలో వున్న టీమ్ కంటే యువత ఆయన సాంకేతికవర్గంలో వున్నారు.
 
ఇదిలా వుండగా, తాజాగా తమిళ నటుడు విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇటీవలే చెన్నై వెళ్ళి ఆయనకు ఓ కథను వినిపించారనీ, అందుకు విజయ్ సమ్మతించారని తెలుస్తోంది. ఈసారి పూరీ యువ నటులను కుండా మధ్యవస్సున్న వారిని ఎంపికచేసుకుని కథలు రావడం మొదలుపెట్టారని సన్నిహితులు తెలియజేస్తున్నారు. ఈ రెండు సినిమాలలో ఓ యువ జంట వుంటుందని టాక్ కూడా వుంది.  ఈ సినిమాను కె.బి.ఎన్. ప్రొడక్షన్ సంస్థలో వెంకట్ కె. నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. వచ్చే నెలలో ఈ సినిమా పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు జిల్లాలో రిలయన్స్ ప్లాంట్.. ఏం తయారు చేస్తారు?

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

ఆర్కెస్ట్రా డ్యాన్సర్‌ను పెళ్లి చేసుకున్నాడనీ వ్యక్తి దారుణ హత్య!

మియాపూర్‌లో పేద విద్యార్థులకు బ్యాక్ టు క్లాస్‌రూమ్ కిట్‌లను పంపిణీ చేసిన క్వాలిజీల్

345 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు : ఈసీ సంచలన నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments