Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరు ఆఫర్‌కి హరీష్ శంకర్ నో చెప్పాడా..?

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (15:13 IST)
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత మలయాళంలో విజయం సాధించిన లూసీఫర్ రీమేక్ చేయనున్నారు. అయితే... ఈ సినిమాకి ముందుగా డైరెక్టర్ సుకుమార్‌ని అనుకున్నారు. సుకుమార్ చేసిన మార్పులు నచ్చకపోవడంతో సుకుమార్ ప్లేస్‌లో సాహో డైరెక్టర్ సుజిత్ వచ్చాడు.
 
సుజిత్ చేసిన మార్పులుచేర్పులు కూడా చిరంజీవికి నచ్చలేదు. ఆ తర్వాత డైనమిక్ డైరెక్టర్ వినాయక్ రంగంలోకి వచ్చారు. వినాయక్ చేసిన మార్పులు కూడా చిరంజీవికి నచ్చలేదు.
 
 దీంతో ఇప్పుడు చిరు చూపు హరీష్ శంకర్ పైన పడిందని తెలిసింది. ఇప్పటికే పలు రీమేక్‌లను సక్సెస్‌ఫుల్‌గా తెరకెక్కించిన హరీష్ శంకర్.. ఈ సినిమాకు న్యాయం చేయగలడని తెలుగు నేటివిటికీ తన ఇమేజ్‌కు అనుగుణంగా మార్చగలడని చిరంజీవి భావించారట. దీని కోసం ప్రొడ్యూసర్ ఎన్వీ ప్రసాద్ ఇప్పటికే హరీష్ తో చర్చలు కూడా జరిపారట. 
 
అయితే... హరీష్ శంకర్ ఈ ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించాడట. కారణం ఏంటంటే... హరీష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా ఇటీవల రిలీజ్ చేసారు.
 
 ఇటీవల పవన్‌ని కలిసిన హరీష్ శంకర్ కలిసారట. వచ్చే ఏడాది ప్రథమార్థంలో క్రిష్ సినిమాతో పాటు ప్యారలల్‌గా ఈ సినిమాని కూడా కంప్లీట్ చేద్దామని పవన్ మాటిచ్చారట. అందుచేత పవన్‌తో చేయనున్న సినిమాపై వర్క్ చేస్తున్నందున లూసీఫర్ రీమేక్ డైరెక్ట్ చేయలేనని చెప్పేసాడట. అదీ.. సంగతి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments