Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో పూరి జగన్నాథ్‌ను కొట్టించిన చిరంజీవి ట్వీట్

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (12:56 IST)
మెగాస్టార్ చిరంజీవి కేవలం వెండితెరపై మాత్రమే.. సోషల్ మీడియాలోనూ సందడి చేస్తున్నారు. సోషల్ మీడియాలోకి ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఆయన చేస్తున్న ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. తాజాగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి చేసిన ఓ ట్వీట్ ఇపుడు కొంప ముంచింది. పూరి చెంప ఛెళ్లుమనిపించేలా చేసింది. పైగా, పూరికి ఆయన భార్యకు మధ్య పెద్ద గొడవే జరిగిందట. ఈ విషయాన్ని పూరి జగన్నాథ్ తాజాగా ఓ ట్వీట్‌ ద్వారా వెల్లడించారు. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. దీంతో చిరంజీవి సరదాగా, దర్శకుడు పూరి జగన్నాథ్‌ను ఉద్దేశించి సరదాగా ఓ ట్వీట్ చశారు. లాక్‌డౌన్ వల్ల పూరి జగన్నాథ్ బ్యాంకాక్, ముంబై బీచ్‌లను బాగా మిస్ అవుతుంటాడని చిరు ట్వీట్ చేశారు.
 
దీనిపై పూరి జగన్నాథ్ స్పందిస్తూ.. చిరంజీవి సార్ పెట్టిన ట్వీట్ తన కొంప ముంచిందన్నారు. ఇలాంటి సమయంలో బ్యాంకాక్ గురించి ఎందుకు ట్వీట్ చేశారో కానీ... మా ఆవిడ నా చెంప పగలగొట్టిందని చెప్పుకొచ్చారు. 
 
చిరంజీవి సార్ ట్వీట్ చూసి గతంలో జరిగినవన్నీ మా ఆవిడకు గుర్తుకొచ్చాయని... దాంతో తన మీద చేయి చేసుకుందని సరదాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దంతెవాడలో ఎన్‌కౌంటర్ - శాఖమూరి అప్పారావు భార్య మృతి!

అనకాపల్లి-అచ్యుతాపురం మధ్య 4 లైన్ల రోడ్డు రాబోతోంది: నారా లోకేష్

అవకాశం వస్తే మళ్లీ స్టార్‌లైనర్‌లో ఐఎస్ఎస్‌లోకి వెళ్తా : సునీతా విలియమ్స్ (Video)

ఏప్రిల్ 1న ఫూల్స్ డే ఎలా వచ్చిందో తెలుసా?

కోటాలో 18 ఏళ్ల జేఈఈ అభ్యర్థి ఆత్మహత్య.. రైల్వే ట్రాక్‌పై పడి.. ఐడీ కార్డు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments