Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ మాటతో దిల్ రాజు తితిదే 'బూరెల బుట్ట'లో పడుతున్నారా?

Webdunia
సోమవారం, 24 జూన్ 2019 (16:03 IST)
ఓం నమో వేంకటేశాయ. అబ్బ... ఈ నామం స్మరించడంలో వున్న అనుభూతి అంతాఇంతా కాదు. ఈ నామ స్మరణ చేస్తూ సాక్షాత్తూ ఆ కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధి యందు ఆయన పాదపద్మములు సేవించే అవకాశం లభిస్తే... ఇంక కావాల్సిందేముంది. ఇలాంటి అవకాశం చాలా కొద్దిమందికే లభిస్తుంటుంది. 
 
తాజాగా శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజుకి ఈ భాగ్యం కలుగుబోతోందని టాలీవుడ్ కోడై కూస్తోంది. తితిదే పాలకమండలిలో దిల్ రాజుకి సభ్యుడయ్యే ఛాన్స్ వస్తుందని చెప్పుకుంటున్నారు. దీనికితోడు మొన్న తితిదే చైర్మన్‌గా బాధ్యతలను వైవీ సుబ్బారెడ్డి స్వీకరించే సమయంలో దిల్ రాజు హాజరయ్యారు. దీనితో ఆయనకు బోర్డులో సభ్యుని పదవి రాబోతోందంటూ వార్తలు వచ్చాయి.
 
ఇదిలావుంటే.. దిల్ రాజు స్నేహితుడు, పీవీపి కూడా ఆయనకు పదవి ఇవ్వాలని సీఎం జగన్ మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. తెలంగాణ నుంచి కూడా దిల్ రాజుకి మద్దతుగా కేటీఆర్ మాట సాయం చేశారని అంటున్నారు. అదలావుంటే దిల్ రాజు శ్రీ వేంకటేశ్వరునికి పరమ భక్తుడు. కనుక ఆ తితిదేలో స్థానం వుంటుందని అనుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments