అల్లు అర్జున్ తదుపరి చిత్రం త్రివిక్రమ్ తోనే !

డీవీ
సోమవారం, 13 జనవరి 2025 (18:35 IST)
Allu Arjun
పుష్ప 2 సినిమా ఇచ్చిన సక్సెస్ తో అల్లు అర్జున్ ఎంత ఆనందంగా వున్నాడో బయటకు వ్యక్తం చేయడానికి సంథ్య థియేటర్ కేస్ కారణం అయితే, రేవంత్ రెడ్డి విమర్శలు కూడా ఓ కారణ అనేది తెలిసిందే. మొత్తానికి సంక్రాంతికి అల్లు అర్జున్ కు కోర్టు కూడా ఫ్రీ నెస్ ఇచ్చేసింది. ఇక ప్రతిసారీ పోలీస్ స్టేషన్ కు రానవసరంలేదనీ, విదేశాలకు కూడా వెళ్ళవచ్చని పేర్కొంది. ఈ స్పూర్తితో తన తదుపరి సినిమా కోసం కసరత్తు చేస్తున్నారు. ఇందుకు అల్లు అరవింద్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిపి సినిమా చేస్తున్నట్లు ప్రధానంగా వార్త బయటకు వచ్చింది. 
 
పుష్ప 3 సినిమా వుంటుందని క్లయిమాక్స్ లో చెప్పాడు. అయితే ఇప్పటి పరిస్థితిలో ఆ సినిమా చేసే ఉద్దేశ్యంలేదని దర్శకుడు సుకుమార్ సూచాయిగా చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే  జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో చిత్రాలు చేసిన త్రివిక్రమ్ తో కలిసి స్వంత బేనర్ లో సినిమా చేయనున్నాడట. ఇందుకు కథను అల్లు అర్జున్ కు కథ కూడా వినిపించాడని తెలుస్తోంది.  త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు సమాచారం. జనవరి నాలుగో వారం నుంచి పాత్ర గెటప్ పై మరోసారి కూర్చుని సెట్ పైకి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ కాంబినేషన్ కాకుండా డాకు మహరాజ్ తో సక్సెస్ సాధించిన థమన్ ఈ సినిమాకు బాణీలు అందించనున్నట్లు తెలుస్తోంది.
 
కాగావంటి సూపర్ హిట్‌ల తర్వాత, అల్లు అర్జున్ – త్రివిక్రమ్ మరోసారి జత కట్టారు. ఈ సినిమాని 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారట. మొత్తానికి తమ నాలుగో చిత్రాన్ని త్రివిక్రమ్ – బన్నీ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. హారిక & హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ కలిసి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ సినిమాకి సంగీత దర్శకుడు థమన్‌ సంగీతం అదించబోతున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments