Webdunia - Bharat's app for daily news and videos

Install App

59 యేళ్ళలోపు రైతులు చనిపోవాలా? సీఎం కేసీఆర్‌కు షర్మిల ప్రశ్న

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (08:15 IST)
రాష్ట్రంలో రైతు భీమా పథకం అమలుపై వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్)పై మండిపడ్డారు. ఇదే అంశంపై ఆమె మీడియాతో మాట్లాడుతూ, రైతు భీమా పథకంలో లబ్ధి పొందేందుకు 59 ఏళ్లు పైబడిన రైతులను చేర్చాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశామన్నారు.
 
రాష్ట్రంలో 66 లక్షల మంది రైతులు ఉన్నారని, అయితే రైతు భీమా పథకానికి కేవలం 41 లక్షల మంది రైతులు మాత్రమే అర్హులుగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. 59 ఏళ్లు పైబడిన రైతులకు ఈ బీమాను వర్తింపజేయడం లేదన్నారు. అంటే 59 యేళ్లలోపే రైతులు చనిపావ చనిపోవాలని టీఆర్‌ఎస్ ప్రభుత్వం కోరుకుంటుందా అని ఆమె ప్రశ్నించారు. పైగా, బీమా కవరేజీని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని ఆమె డిమాండ్ చేశారు.
 
బంగారు తెలంణాను సాధించామని, ఇక బంగారు భారతదేశాన్ని సాధిద్దామని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది బంగారు తెలంగాణ కాదని, బానిసత్వపు తెలంగాణ అంటూ ధ్వజమెత్తారు. 
 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments