Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్.షర్మిలకు ఇన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయా..? హెల్త్ బులిటెన్ రిలీజ్

Webdunia
ఆదివారం, 11 డిశెంబరు 2022 (15:33 IST)
తన పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలన్న ఏకైక డిమాండ్‌తో గత రెండు రోజులుగా ఆమరణ నిరాహారదీక్షకు దిగిన వైఎస్ఆర్ టీపీ పార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల దీక్షను తెలంగాణ పోలీసులు భగ్నం చేసిన ఆమెను జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఓ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. 
 
ఆదివారం తెల్లవారుజామున ఒంటి గంటకు ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారని, బీపీ, బలహీనత, మైకగా ఉండటంతో ఆస్పత్రిలో చేరినట్టు తెలిపారు. ఆమెకు డీహైడ్రేషన్, ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ ఉందని, తీవ్రమైన ఒలిగురియా, అధిక అయాన్ గ్యాప్ మెటాబాలిక్ అసిడోసిమ్, ప్రీరీనల్ అజోటెమియా కూడా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. 
 
ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఈ రోజు లేదా రేపు ఉదయం డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. షర్మిల 2 లేదా 3 వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. 
 
కాగా, తన పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చినా ప్రభుత్వం మాత్రం అందుకు నిరాకరించింది. దీంతో ఆమె లోటస్ పాండ్‌లోని వైఎస్ఆర్ టీపీ ప్రధాన కార్యాలయంలో ఆమరణ నిరాహారదీక్షకు శనివారం నుంచి చేపట్టారు. ఆదివారం అర్థరాత్రి ఆమె దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments