కేసీఆర్‌ కుటుంబం దోచుకుని దాచుకుంటోంది: వైఎస్ షర్మిల

Webdunia
గురువారం, 8 జులై 2021 (19:37 IST)
వైఎస్‌ సంక్షేమ పాలన తేవడమే వైఎస్సార్‌ టీపీ లక్ష్యమని వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీని ప్రకటించిన ఆమె సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగులు బడ్జెట్‌ ఉన్న తెలంగాణలో పేదరికం పోలేదని వ్యాఖ్యానించారు. రూపాయి బియ్యం కోసం ఇంకా రేషన్‌ షాపుల ఎదుట లైన్లు ఉంటున్నామని ఆమె పేర్కొన్నారు.

‘‘అధికారం ఉన్నప్పుడే ఫామ్‌హౌస్‌ చక్కబెట్టుకుంటున్నారు. కేసీఆర్‌ కుటుంబం దోచుకుని దాచుకుంటోంది. పేదరికం నుంచి బయటపడింది కేసీఆర్‌ ఫ్యామిలీనే. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ఉంటే పేదలకు భరోసా ఉండేది. కరోనాకు ఎంతో మంది బలైపోయారు.. ఆస్తులమ్ముకున్నారు.

సంక్షేమంలో దేశంలోనే నెంబర్‌ వన్‌ అని చెప్పుకుంటున్న కేసీఆర్‌ ఆస్తులమ్ముకున్న కుటుంబాలకు ఏం సమాధానం చెబుతారు?. తప్పైందని ముక్కు నేలకు రాస్తే కేసీఆర్‌ పాపం పోతుందా?. వైఎస్‌ సంక్షేమం అంటే భరోసా, రక్షణ, భద్రత. వైఎస్‌ సంక్షేమం అంటే కరోనాలాంటి ఎన్ని విపత్తులు వచ్చినా అప్పులపాలు కాకుండా నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా పొందడం వైఎస్‌ బతికి ఉంటే అదే చేసేవారు.’’ అని షర్మిల తెలిపారు. 
 
షర్మిల ఇంకా మాట్లాడుతూ ‘‘కేసీఆర్‌ సంక్షేమం అంటే పథకాలు ప్రకటించి దిక్కులు చూడాలి. ఆరోగ్య కార్డులు ఇవ్వాలి.. ఆరోగ్యాన్ని గాలికి వదిలేయాలి. రైతుభరోసా ఇచ్చి ఆ డబ్బును వడ్డీ కింద జమకట్టుకోవాలా?. కేసీఆర్‌ సంక్షేమం అంటే ఇంటికో ఉద్యోగం అని చెప్పి ఏళ్లు గడిచినా వాయిదా వేసుకోవాలి. 6 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే చనిపోయినవారు రైతులు కాదని చెప్పడం సంక్షేమమా?.

కేసీఆర్‌ సంక్షేమం అంటే గారడీ మాటలు.. చేతికి చిప్పలు. ఎవరిని అడిగినా సంక్షేమానికి రారాజు వైఎస్సార్‌ అని చెబుతారు. పేదరికాన్ని రూపుమాపడమే వైఎస్సార్‌ టీపీ లక్ష్యం. తరాలు మారినా తలరాతలు మారడం లేదు. సంక్షేమమంతా రేషన్‌ బియ్యం చుట్టూనే తిరుగుతోంది. సంక్షేమం ఆకలి తీర్చి ఆగిపోతోంది.. ఉపాధి కల్పించడంలేదు.’’ అని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంతారా ఎఫెక్ట్.. టాలీవుడ్ హీరోల కళ్లపై కునుకు లేకుండా చేస్తోన్న రిషబ్ శెట్టి?

కపుల్ ఫ్రెండ్లీ నా కెరీర్ లో గుర్తుండిపోయే మూవీ అవుతుంది :సంతోష్ శోభన్

ది ఇండియా హౌస్ తో తెలుగులో ఎంట్రీ ఇస్తున్న కంపోజర్ శాశ్వత్ సచ్‌దేవ్

Nabha Natesh: మహాశివరాత్రికి మైథలాజికల్ యాక్షన్ డ్రామా నాగబంధం టీజర్

అలాంటి బుర్ర వున్నవాడితో పిల్లల్ని కంటే కష్టమే, అందుకే వదిలేసా: మృణాళ్ ఠాకూర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

హైదరాబాద్‌ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments