Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోస్టల్ ద్వారా యాదాద్రి ప్రసాదం

Webdunia
మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (08:32 IST)
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి భక్తులకు దేవాదాయశాఖ శుభవార్త చెప్పింది. త్వరలోనే స్వామిఅమ్మవార్ల ప్రసాదంతో పాటు అక్షితలు, కుంకుమను నేరుగా భక్తుల ఇంటికి చేర్చేలా నిర్ణయం తీసుకున్నారు.

స్పీడ్ పోస్టులో తపాలాశాఖ ఈ సేవలను భక్తులకు అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు దేవాదాయశాఖ అధికారులు పోస్టల్శాఖ అధికారులతో చర్చించారు. త్వరలోనే భక్తులకు ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ఒక్క యాదాద్రిలోనే కాకుండా బాసర, భద్రాచలం, వేములవాడ సహా మరో 10 ఆలయాల నుంచి భక్తుల కోరుకున్న విధంగా ప్రసాదం, అక్షితలు, కుంకుమను స్పీడ్ పోస్టులో ఇంటికి పంపేలా తపాలా శాఖతో అగ్రిమెంట్ కుదుర్చుకోనున్నారు.

ఇందుకోసం దేవాదాయ శాఖ ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించనున్నట్టు తెలుస్తోంది. ఈ సేవలను పొందేందుకు చెల్లింపులను నెట్ బ్యాంకింగ్‌తో పాటు ఇతర ఆన్‌లైన్ పద్ధతుల్లో స్వీకరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ చెల్లింపులను పోస్టల్ శాఖ బరువు ఆధారంగా నిర్ణయించనుంది. ఈ సేవలు ఫిబ్రవరి నెలాఖరుకల్లా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments