Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగిత్యాలలో దారుణం: మంచాన్నే చితిగా మార్చుకొంది..

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (14:17 IST)
జగిత్యాలలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో మంచానికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అనారోగ్యంతో పాటు ఎవరు లేని జీవితం వేధించడంతో అనారోగ్యంతో మంచానికే పరిమితమైన ఆమె.. ఆ మంచాన్నే తన చితిగా మార్చుకొంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో మంచానికి నిప్పు అంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బంజరుదొడ్డి ప్రాంతానికి చెందిన బొండ ఈరమ్మ భర్త రత్నం ఇరవై ఏళ్ల క్రితమే మృతి చెందాడు. దీంతో కూలీ నాలీ చేసుకుంటూ తన కొడుకును పెంచి పెళ్లి చేసింది. విధి వక్రించడంతో 8 ఏళ్ల క్రితం కొడుకు, కోడలు ఇద్దరు ప్రమాదంలో మృతి చెందారు. అప్పటినుంచి మనవడిని పెంచుతూ జీవిస్తున్న ఆమె గత కొద్దికాలంగా అనారోగ్య సమస్యలతో పోరాడుతూ మంచానికే పరిమితమయ్యింది.
 
ఆస్పత్రి ఖర్చుల కోసం మనవడిని ఇబ్బంది పెట్టకూడదనుకొంది. మంగళవారం ఇంట్లో ఎవరులేని సమయంలో తన మంచానికి నిప్పు పెట్టుకొని సజీవ దహనం అయ్యింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments