Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాటింగ్ చేస్తూ చేస్తూ ఐ లవ్ యు అని చెప్పాడు.. ఆ తర్వాత?

Webdunia
శనివారం, 2 జనవరి 2021 (10:13 IST)
ఎంబీఎ చదువుతున్న తన సహ విద్యార్థినితో చాటింగ్ చేస్తూ చేస్తూ ఓ విద్యార్థి ఐ లవ్ యు అని మెసేజ్ పెట్టాడు. అప్పటివరకూ స్నేహితుడుగా వున్న ఆ వ్యక్తి అలా చెప్పేసరికి సదరు విద్యార్థిని షాక్ తిన్నది. ఇక అతడితో చాటింగ్ చేయడం మానేసింది. దీనితో ఆగ్రహం చెందిన ఆ యువకుడు ఆ విద్యార్థినిని కాల్ గర్ల్ అంటూ ఓ డేటింగ్ వెబ్ సైట్లో పెట్టి వేధింపులకు పాల్పడ్డాడు.
 
పూర్తి వివరాలు చూస్తే... కింగ్ కోఠీలో నివాసం వుండే సమీర్ ఇబ్రహీంపట్నం ఎంఆర్ఎం కాలేజీలో ఎంబీఎ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో తన క్లాస్ మేట్ అయిన విద్యార్థినితో పరిచయం కాస్తా స్నేహంగా మారింది. ఐతే అతడు స్నేహం పేరుతో దగ్గరై ప్రేమిస్తున్నానంటూ తన కోరికను బయటపెట్టాడు. దీనితో షాక్ తిన్న యువతి అతడిని దూరం పెట్టేసింది.
 
ఆమె తనను దూరం పెట్టిందని ఆగ్రహించిన అతడు ఆమె ఫోన్ నెంబరు, ప్రొఫైల్ ఫోటోను జతచేసి ఓ డేటింగ్ సైట్లో కాల్ గర్ల్ అంటూ పోస్ట్ చేసాడు. ఇది గమనించిన విద్యార్థిని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments