Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫోన్ చేస్తుంటే బ్లాక్ లిస్టులో పెట్టేసిన ప్రియుడు, ఇక ఎందుకీ జీవితం అనుకున్న ప్రేయసి

ఫోన్ చేస్తుంటే బ్లాక్ లిస్టులో పెట్టేసిన ప్రియుడు, ఇక ఎందుకీ జీవితం అనుకున్న ప్రేయసి
, సోమవారం, 23 నవంబరు 2020 (22:52 IST)
పండంటి కాపురం.. 13 యేళ్ళ కొడుకు. హాయిగా సాగిపోతున్న జీవితం. ఉన్నట్లుండి భర్తకు గుండెనొప్పి రావడంతో చనిపోయాడు. ఇంకేముంది ఆ కొడుకుతో ఆ వివాహిత నానా కష్టాలు పడింది. ఆస్తి ఉన్నా భర్త లేని లోటు ఆమెకు వెలితిగా అనిపించింది. అందుకే ఫేస్ బుక్‌లో అకౌంట్ ఓపెన్ చేసింది. ఆ అకౌంట్ చివరకు తన జీవితాన్ని నాశనం చేస్తుందని ఊహించలేదు వివాహిత.
 
తమిళనాడు కోయంబత్తూరు సిటీ. సెంథిల్ కుమార్, భువనేశ్వరికి 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. సెంథిల్ కుమార్ ఆర్థికంగా బాగా సంపాదించాడు. ఎలాంటి ఇబ్బందులు లేని కుటుంబం. 13 యేళ్ళ కుమారుడు కూడా వీరికి ఉన్నారు. అయితే సరిగ్గా రెండు నెలల క్రితం భర్త ఉన్నట్లుండి గుండెపోటుతో చనిపోయాడు.
 
దీంతో భువనేశ్వరి ఒంటిరిగా మారిపోయింది. కొడుక్కి లోకజ్ఞానం తెలియకపోవడంతో ఎలా నెట్టుకురావాలో తెలియలేదు. కావాల్సినంత డబ్బు ఉన్నా శారీరక సుఖం లేకపోవడం ఆమెను బాగా కుంగదీసింది. దీంతో ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసింది. కోయంబత్తూరులో ఉన్న స్నేహితులను వెతికింది.
 
అందులో ఒక యువకుడు ఖాజా అనే వ్యక్తికి బాగా కనెక్టయ్యింది. ఆ పరిచయం కాస్త ఇద్దరి మధ్యా శారీరక సంబంధానికి దారితీసింది. ఖాజా ఖాళీగా తిరగుతూ ఉండేవాడు. దీంతో భువనేశ్వరి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లి ఎంజాయ్ చేసేవాడు. కానీ ఖాజాకు భువనేశ్వరి బోర్ కొట్టేసింది. గత వారంరోజుల నుంచి ఎన్నిసార్లు ఫోన్లు తీసినా స్పందించలేదు. అంతేకాదు ఆమె నెంబర్ బ్లాక్ లిస్ట్‌లో పెట్టేశాడు. దీంతో ఆవేదనకు గురైంది భువనేశ్వరి. ప్రియుడి లేని జీవితం వద్దనుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం భువనేశ్వరి కుమారుడు ఎవరూ లేని అనాధలా మారిపోయాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ సీఎం జగన్‌కు సోము వీర్రాజు వార్నింగ్