Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉద్యోగినితో అక్రమ సంబంధం... గుజరాత్‌లో శవమైతేలిన ఢిల్లీ వ్యాపారి!

ఉద్యోగినితో అక్రమ సంబంధం... గుజరాత్‌లో శవమైతేలిన ఢిల్లీ వ్యాపారి!
, గురువారం, 19 నవంబరు 2020 (11:20 IST)
తన వద్ద పనిచేసే ఓ ఉద్యోగినితో కంపెనీ యజమాని వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం ఉద్యోగిని కుటుంబ సభ్యులకు తెల్సిందే. అంతే.. మాట్లాడుకుందామని ఇంటికి పిలిచారు. అక్కడ ఆయనను చితకబాది హత్య చేశారు. ఈ హత్యకు ఉద్యోగిని తల్లితో పాటు.. మరో వ్యక్తి కూడా సహకరించారు. ఆ తర్వాత శవాన్ని తీసుకెళ్లి గుజరాత్‌లో పడేశారు.
 
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ దారుణ హత్య వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీలోని మోడల్ టౌన్ ప్రాంతానికి చెందిన నీరజ్ గుప్తా (46) అనే వ్యాపారి, తన వద్ద పనిచేస్తున్న ఉద్యోగినితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులతో పాటు.. కాబోయే భర్తకు తెలిసింది. అంతే.. మాట్లాడుకుందాం ఇంటికి రమ్మని నీరజ్ గుప్తాను పిలిచారు. వారి మాటలు ఉద్యోగిని ఇంటికి ఈ నెల 13వ తేదీన వ్యాపారి వెళ్లాడు.
 
ఆ తర్వాత అతని ప్రియురాలు, ఆమె తల్లి, కాబోయే భర్త తదితరులు కలిశారని, ఆపై వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన తర్వాత, తొలుత నీరజ్ తలపై ఇటుకతో కొట్టి, ఆపై కడుపులో మూడు సార్లు పొడిచి, గొంతుకు ఉరి బిగించి హత్య చేశారని, ఇందుకు సదరు యువతి, ఆమె తల్లి కూడా సహకరించారు. ఆ తర్వాత శవాన్ని సూట్ కేసులో పెట్టి, రైలెక్కి, గుజరాత్ వరకూ ప్రయాణించి, భారుచ్ ప్రాంతంలో పడేసి వచ్చాడు.
 
అయితే, తన భర్త నీరజ్ గుప్తా కనిపించడం లేదని ఆయన భార్య ఆదర్శ్ నగర్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. పైగా, తన భర్త అక్రమ సంబంధం గురించి భార్యే పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం బయటపడిందని పోలీసులు వెల్లడించారు. 
 
ఆపై గుజరాత్‌లో బయటపడిన మృతదేహం నీరజ్‌దేనని గుర్తించామని, కేసును మరింత లోతుగా విచారిస్తున్నామని వెల్లడించారు. ఈ కేసులో యువతి ఫైసల్ (29), ఆమె తల్లి షాహీన్ నాజ్ (45), ఫైసల్‌కు కాబోయే భర్త జుబేర్ (28)లను అరెస్ట్ చేశామని పోలీసు అధికారి విజయాంత ఆర్యా వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గడిచిన 24 గంటల్లో భారత్‌లో 45,576 కొత్త కేసులు