Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛైర్మన్​, మేయర్​ పదవులన్నీ మనవే: కేసీఆర్

Webdunia
శనివారం, 11 జనవరి 2020 (03:11 IST)
పురపాలక ఎన్నికల్లో తెరాస విజయంపై ముఖ్యమంత్రి కేసీఆర్​ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రమంతా తెరాసకే సానుకూలంగా ఉందని.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు..పురపాలక ఇన్‌ఛార్జ్‌లతో జరిగిన సమావేశంలో వివరించారు.

పురపాలక ఎన్నికలకు సంబంధించిన ఏ, బీ ఫారాలను ఎమ్మెల్యేలకు కేసీఆర్​ పంపిణీ చేశారు. పురపాలికలు, నగరపాలికల్లో తెరాస అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించేందుకు కార్యకర్తలందరూ కృషి చేయాలని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్​ పిలుపునిచ్చారు.

మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో టికెట్ల కోసం తీవ్ర పోటీ ఉందని కేసీఆర్​ తెలిపారు. నాయకత్వం వహించాలని ఆశపడటంలో ఏ మాత్రం తప్పు లేదని.. అయితే టికెట్ దక్కని నేతలు నిరాశ పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

భవిష్యత్తులో అనేక అవకాశాలు ఉంటాయని... నామినేటెడ్ పోస్టులు ఎన్నో భర్తీ చేయాల్సి ఉందన్న విషయం వివరించాలని ఎమ్మెల్యేలకు కేసీఆర్​ దిశానిర్దేశం చేశారు. అసంతృప్తులు, అసమ్మతుల మాట వినిపించకుండా చూడాల్సిన బాధ్యత స్థానిక శాసనసభ్యులదేనని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments