Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీయులోని రోగిని కొరికిన ఎలుకలు.. తీవ్ర రక్తస్రావం

Webdunia
గురువారం, 31 మార్చి 2022 (13:28 IST)
వరంగల్ జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఐసీయు వార్డులో చికిత్స పొందుతున్న ఓ రోగిని ఎలుకలు కొరికాయి. దీంతో ఆయన తీవ్ర రక్తస్రావమైంది. కాళ్లు, చేతులు కొరికేయడంతో ఆ రోగికి తీవ్ర గాయాలయ్యాయి. 
 
వరంగల్ పట్టణానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి నాలుగు రోజుల క్రితం అనారోగ్యానికి గురై ఎంజీఎం ఆస్పత్రిలో చేరాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయు వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఈ వార్డులోని ఎలుకలు ఆ రోగి కాళ్లు, చేతులు కొరికివేశాయి. దీంతో ఆయనకు తీవ్ర రక్తస్రావమైంది. 
 
ఈ ఘటనతో అప్రమత్తమైన వైద్య సిబ్బంది ఎలుకలు తరిమేసి శ్రీనివాస్‌కు వైద్యం చేశారు. అయితే, ఈ విషయం తెలిసిన రోగి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా కేంద్రంలో ఉండే ఆస్పత్రిలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమని వారు వాపోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments