Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రీతి ఆత్మహత్య కేసు.. సైఫ్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2023 (11:40 IST)
తెలంగాణలో సంచలనం సృష్టించిన ప్రీతి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు డాక్టర్ సైఫ్‌కు వరంగల్ జిల్లా కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వరంగల్‌లో సీనియర్ వైద్యుడు సైఫ్ వేధింపుల కారణంగా పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యకు పాల్పడింది. 
 
ఈ నేపథ్యంలో డా. సైఫ్‌కు రూ. గ్యారెంటీ సమర్పించాలనే షరతుపై బెయిల్ మంజూరు చేయడం జరిగింది. రూ.10 వేలు, ఇద్దరు పూచీకత్తులతో బెయిల్ మంజూరు చేశారు. ఇంకా వచ్చే 16 వారాల పాటు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. 
 
అయితే విచారణ సందర్భంగా బెదిరింపులకు పాల్పడినా, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించినా బెయిల్ రద్దు చేస్తామని కోర్టు హెచ్చరించింది. 
 
ప్రీతి ఆత్మహత్యకు సైఫ్ వేధింపులే కారణమని పోలీసులు గతంలో నిర్ధారించడంతో అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. షరతులతో కూడిన బెయిల్ మంజూరు నిర్ణయంపై మిశ్రమ స్పందనలు వచ్చాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వంభర డబ్బింగ్ పనులు ప్రారంభించారు

ఓజీ.. ఓజీ అని వెళితే... ప్రజలు క్యాజీ అంటూ ప్రశ్నిస్తారు : పవన్ కళ్యాణ్

జీబ్రా చిత్రం నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ విడుదల

జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments