ప్రీతి ఆత్మహత్య కేసు.. సైఫ్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2023 (11:40 IST)
తెలంగాణలో సంచలనం సృష్టించిన ప్రీతి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు డాక్టర్ సైఫ్‌కు వరంగల్ జిల్లా కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వరంగల్‌లో సీనియర్ వైద్యుడు సైఫ్ వేధింపుల కారణంగా పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యకు పాల్పడింది. 
 
ఈ నేపథ్యంలో డా. సైఫ్‌కు రూ. గ్యారెంటీ సమర్పించాలనే షరతుపై బెయిల్ మంజూరు చేయడం జరిగింది. రూ.10 వేలు, ఇద్దరు పూచీకత్తులతో బెయిల్ మంజూరు చేశారు. ఇంకా వచ్చే 16 వారాల పాటు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. 
 
అయితే విచారణ సందర్భంగా బెదిరింపులకు పాల్పడినా, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించినా బెయిల్ రద్దు చేస్తామని కోర్టు హెచ్చరించింది. 
 
ప్రీతి ఆత్మహత్యకు సైఫ్ వేధింపులే కారణమని పోలీసులు గతంలో నిర్ధారించడంతో అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. షరతులతో కూడిన బెయిల్ మంజూరు నిర్ణయంపై మిశ్రమ స్పందనలు వచ్చాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

ప్రభాస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Vijay Kisses Rashimika: రష్మిక మందన్న తో తమ సంబంధాన్ని ప్రకటించిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

తర్వాతి కథనం
Show comments