Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొలాలకు వెళ్లే రైతులను చితకబాదుతున్న విరుగుతున్న లాఠీ

Webdunia
సోమవారం, 24 మే 2021 (11:45 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ లాక్డౌన్ అమలవుతోంది. అయితే, రైతులకు మాత్రం ఈ లాక్డౌన్ ఆంక్షలు వర్తించవచ్చని ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది. అయితే పోలీసులు మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. రోడ్ల మీద కనిపిస్తున్న రైతులను చావబాదుతున్నారు. అన్నదాతలపై లాఠీ ఝళిపిస్తున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వికారాబాద్‌ జిల్లా పరిధిలో పొలాలకు వెళ్తున్న రైతులపై గత మూడు రోజుల్లో పోలీసులు తమ ప్రతాపం చూపించారు. ఆదివారం అంబేద్కర్‌ నగర్‌ నుంచి తన పొలానికి వెళ్తున్న ఓ రైతును పోలీసులు ఇష్టానుసారంగా కొట్టారు. ఆ రైతు చేతిపై వాతలు పడ్డాయి. తీవ్రనొప్పి ఉండటంతో చేతిని కదపలేకపోతున్నాడు. 
 
'పొలం వద్ద పశువులకు నీరు పెట్టి గడ్డి వేసి వస్తాను సార్' అని చెప్పినా కూడా పోలీసులు అదేమీ వినిపించుకోకుండా కొట్టారని తెలిసింది. అలాగే.. మందుల కోసం మెడికల్‌ షాపులకు, చికిత్స కోసం ఆస్పత్రులకు వెళ్లే వారిని కూడా పోలీసులు అడ్డుకుంటున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
వెంకటయ్య అనే వ్యక్తి ఆస్పత్రికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకొని ఆయనకు జరిమానా విధించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ నారాయణ, వెంకటయ్యకు ఆదివారం ఫోన్‌చేసి జరిమానా గురించి ఆలోచించవద్దని ఆరోగ్యం బాగా చూసుకోవాలని సూచించారు. ఉన్నతాధికారులు ఫోన్‌ చేసి మాట్లాడటంతో వెంకటయ్య సంతోషం వ్యక్తం చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sanoj Mishra: సినిమా ఛాన్సిస్తానని యువతిపై అత్యాచారం.. మోనాలిసా టైమ్ బాగుండి..?

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అమర్ దీప్ చౌదరి హీరోగా సుమతీ శతకం ప్రారంభం

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

తర్వాతి కథనం
Show comments