Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ బలపడటాన్ని తెరాస ఓర్చుకోలేకపోతోంది : విజయశాంతి

Webdunia
బుధవారం, 26 జనవరి 2022 (17:02 IST)
తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రోజురోజుకూ బలపడటాన్ని అధికార తెరాస పార్టీ నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారంటూ బీజేపీ మహిళా నేత, సినీ నటి విజయశాంతి అన్నారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ వాహనంపై దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని ఖండించిన బీజేపీ నేతలు పోలీసులతో పాటు.. తెరాస ప్రభుత్వ వైఫల్యాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. 
 
ఇదే అంశంపై విజయశాంతి మాట్లాడుతూ, తెలంగాణాలో బీజేపీ నానాటికీ బలపడటాన్ని చూసి ఓర్వలేని తెరాస ప్రభుత్వం రాజకీయంగా ఎదిరించలేక గూండా రాజకీయాలకు తెరతీస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలపై భౌతిక దాడులకు తెగబడటం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు. 
 
ఒక పార్లమెంట్ సభ్యుడికి భద్రత కల్పించలేని పోలీసులు రాష్ట్రంలో ఉంటే ఎంత.. లేకుంటే ఎంత? అంటూ ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో తెరాస నేతల తెరాస గూండాల అరాచకాలు నానాటికీ పెరిగిపోతున్నాయని, పోలీసులు అధికారులు మాత్రం చోద్యం చూస్తూ మీనమేషాలు లెక్కిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ దగాకోరు పాలన సాగిస్తున్నారంటూ మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments