Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ బలపడటాన్ని తెరాస ఓర్చుకోలేకపోతోంది : విజయశాంతి

Webdunia
బుధవారం, 26 జనవరి 2022 (17:02 IST)
తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రోజురోజుకూ బలపడటాన్ని అధికార తెరాస పార్టీ నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారంటూ బీజేపీ మహిళా నేత, సినీ నటి విజయశాంతి అన్నారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ వాహనంపై దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని ఖండించిన బీజేపీ నేతలు పోలీసులతో పాటు.. తెరాస ప్రభుత్వ వైఫల్యాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. 
 
ఇదే అంశంపై విజయశాంతి మాట్లాడుతూ, తెలంగాణాలో బీజేపీ నానాటికీ బలపడటాన్ని చూసి ఓర్వలేని తెరాస ప్రభుత్వం రాజకీయంగా ఎదిరించలేక గూండా రాజకీయాలకు తెరతీస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలపై భౌతిక దాడులకు తెగబడటం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు. 
 
ఒక పార్లమెంట్ సభ్యుడికి భద్రత కల్పించలేని పోలీసులు రాష్ట్రంలో ఉంటే ఎంత.. లేకుంటే ఎంత? అంటూ ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో తెరాస నేతల తెరాస గూండాల అరాచకాలు నానాటికీ పెరిగిపోతున్నాయని, పోలీసులు అధికారులు మాత్రం చోద్యం చూస్తూ మీనమేషాలు లెక్కిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ దగాకోరు పాలన సాగిస్తున్నారంటూ మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments