Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంకా ఎన్ని ప్రాణాలు బలైపోవాలి చెప్పండి? కేసీఆర్ పైన విజయశాంతి పైర్

Webdunia
శనివారం, 19 సెప్టెంబరు 2020 (17:25 IST)
హైదరాబాద్ దీనదయాళ్ నగర్‌లో ఉన్న నాలాలో సుమేద అనే 12 ఏళ్ల విద్యార్థిని పడిపోయి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పైన కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి తీవ్రంగా మండిపడ్డారు. ట్విట్టర్ ద్వారా ఆమె స్పందిస్తూ కేసీఆర్ గారు మీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంకెన్ని ప్రాణాలు పోవాలో చెప్పండి అని ప్రశ్నించారు.
 
అభంశుభం తెలియని చిన్నారి జీవితం కరిగిపోయిందని చెప్పారు. విశ్వనగరం చేస్తామంటూ మీరు చెప్పుకుంటున్న జంటనగరాల్లో వర్షాలు పడినప్పుడల్లా డ్రైనేజిలు, నాలాలు, మ్యాన్ హోల్స్ కనిపించనంతగా నీరు నిండిపోయి ఎన్ని ప్రాణాలు పోయాయో లెక్కతీస్తే గిన్నిస్ రికార్డ్ అవుతుందని విమర్శించారు.
 
ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా మీ పార్టీ నేతలు రావడం, ఇలా జరక్కుండా చూస్తామని మాటలు చెప్పడం మామూలైపోయింది. పాత ప్రభుత్వాల వల్లే హైదరాబాదులో పలు ప్రాంతాలు మునిగిపోతున్నాయని మీరు ఎన్నోసార్లు విమర్శించారు, మరి ఈ ఆరేళ్ల పాలనలో మీరు చేసిందేమిటని ఎద్దేవా చేశారు.
 
ఇప్పుడు ఇతర తెలంగాణ పట్టణాలు, నగరాలు కూడా హైదరాబాదుకు తోడవుతున్నాయని అడుగడుగునా కబ్జాలు అక్రమ కట్టడాలతో చినుకు పడితే చాలు ఆ ప్రాంతాలు మునిగిపోయే పరిస్థితి నెలకొందని విజయశాంతి మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments