Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యకు కోర్టులో ఉద్యోగం.. కోపంతో ఊగిపోయిన భర్త.. ఏం చేశాడంటే?

Webdunia
శనివారం, 19 సెప్టెంబరు 2020 (17:12 IST)
భార్యకు కోర్టులో ఉద్యోగం వచ్చింది. అయితే ఆమె భర్త మాత్రం కోపంతో రగిలిపోయాడు. భార్యను కుర్చీకి కట్టేసి పెట్రోల్ పోసి తగల పెట్టేందుకు ప్రయత్నించాడు. ఆయితే ఆమె అరుపులు విన్న ఇరుగు పొరుగు వారు అప్రమత్తమవడంతో తృటిలో ప్రాణాపాయం తప్పిపోయింది. నిందితుడు సురేశ్ రాజన్‌కు 15 ఏళ్ల క్రితం వివాహం అయింది. కాగా.. ఆగస్టు 2 అతడి భార్య ఇఫ్షీబాయికి కోర్టులో ఉద్యోగం వచ్చింది.
 
అయితే.. భార్య ఉద్యోగం చేయటం ఇష్టం లేని అతడు ఆమె కోపంతో రగిలిపోయాడు. ఆమెను వేధించడం ప్రారంభించిన అతడు ఇటీవల ఓ రోజు ఆమెను కూర్చీకి కట్టేశాడు. భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశాడు. 
 
దీంతో ప్రాణ భయంతో వణికిపోయిన ఆమె.. పెద్ద పెట్టున కేకలు పెట్టండంతో ఇరుగు పొరుగు వారు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న వారు బాధితురాలిని కాపాడి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: గ్లామరస్‌ రోల్స్‌ చేయవద్దనే రూల్ పెట్టుకోలేదు : మాళవిక మనోజ్‌

Nabha : ఎలీ ఇండియా జూలై మేగజైన్ కవర్ పైజీపై నభా నటేష్

Natti: చిన్న సినిమాకు 2-30 గంటల షో కేటాయించాలి : నట్టి కుమార్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments