Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీ మారుతున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు : నటి విజయశాంతి

Webdunia
ఆదివారం, 12 నవంబరు 2023 (11:32 IST)
తాను పార్టీ మారుతున్నాంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారంటూ సినీ నటి, బీజేపీ మహిళా నేత విజయశాంతి ఆరోపించారు. అదేసమయంలో తాను పార్టీ మారడం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో స్పష్టంచేశారు. శనివారం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగిన ప్రధాని నరేంద్ర మోడీ సభకు ఆమె హాజరై ప్రసంగించారు. తాను బీజేపీని వీడుతున్నట్టు ప్రచారం చేస్తున్నారని, తాను పార్టీని ఎందుకు వీడుతానని ఆమె స్పష్టంచేశారు. 
 
కాగా, ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆమెను ఆ పార్టీ నాయకత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో త్వరలోనే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు ప్రచారం జరిగింది. దీనికితోడు తన గురించి ఎన్నో రకాలైన ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నప్పటికీ ఆమె మాత్రం ఎక్కడా కూడా నోరు విప్పలేదు. 
 
ఈ ప్రచారం ఇలా సాగుతుంటే, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోమారు చర్చనీయాంశంగా మారాయి. మరో రెండు మూడు రోజుల్లో విజయశాంతి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారంటూ ప్రకటించి, ఈ ప్రచారానికి మరింత ఊపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంతో పాటు వైరల్ కావడంతో విజయశాంతి నోరు విప్పక తప్పలేదు. తాను బీజేపీని వీడుతున్నట్టు సాగుతున్న ప్రచారంలో రవ్వంత కూడా నిజం లేదని ఆమె స్పష్టంచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments