పార్టీ మారుతున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు : నటి విజయశాంతి

Webdunia
ఆదివారం, 12 నవంబరు 2023 (11:32 IST)
తాను పార్టీ మారుతున్నాంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారంటూ సినీ నటి, బీజేపీ మహిళా నేత విజయశాంతి ఆరోపించారు. అదేసమయంలో తాను పార్టీ మారడం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో స్పష్టంచేశారు. శనివారం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగిన ప్రధాని నరేంద్ర మోడీ సభకు ఆమె హాజరై ప్రసంగించారు. తాను బీజేపీని వీడుతున్నట్టు ప్రచారం చేస్తున్నారని, తాను పార్టీని ఎందుకు వీడుతానని ఆమె స్పష్టంచేశారు. 
 
కాగా, ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆమెను ఆ పార్టీ నాయకత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో త్వరలోనే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు ప్రచారం జరిగింది. దీనికితోడు తన గురించి ఎన్నో రకాలైన ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నప్పటికీ ఆమె మాత్రం ఎక్కడా కూడా నోరు విప్పలేదు. 
 
ఈ ప్రచారం ఇలా సాగుతుంటే, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోమారు చర్చనీయాంశంగా మారాయి. మరో రెండు మూడు రోజుల్లో విజయశాంతి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారంటూ ప్రకటించి, ఈ ప్రచారానికి మరింత ఊపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంతో పాటు వైరల్ కావడంతో విజయశాంతి నోరు విప్పక తప్పలేదు. తాను బీజేపీని వీడుతున్నట్టు సాగుతున్న ప్రచారంలో రవ్వంత కూడా నిజం లేదని ఆమె స్పష్టంచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: రవితేజ, డింపుల్ హయతి.. భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మెలోడీ సాంగ్

ఎవరు కొత్త తరహా సినిమా చేసినా ప్రోత్సాహించాలి, లేకుంటే ముందడుగు వేయలేరు : కార్తి

మాకు మనవళ్ళు పుట్టినా నాగార్జున అలానే ఉన్నారు.. యాంటీ ఏజింగ్ టెస్టులు చేయాలి...

విదు, ప్రీతి అస్రాని మ‌ధ్య కెమిస్ట్రీ 29 సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ

మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతం.. పురుష కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తర్వాతి కథనం
Show comments