కారు.. సారు..అన్నది అందుకేనా?.. విజయశాంతి

Webdunia
శనివారం, 7 సెప్టెంబరు 2019 (09:23 IST)
ముఖ్యమంత్రి కేసీఆర్ తనను తాను మహారాజుగా ఊహించుకుంటున్నారని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి విమర్శించారు. యాదగిరి గుట్ట ఆలయంలో స్తంభాలపై దేవతా మూర్తులతోపాటు తన బొమ్మను, కారు గుర్తును, ప్రభుత్వ పథకాలను చెక్కించుకోవడం ఏమిటని నిలదీశారు.

"కేసీఆర్ తన దొరతనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ ధోరణి ప్రజాస్వామ్యానికే ముప్పు. ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పదేపదే సారు... కారు.... సర్కార్ అనే డైలాగ్ ను వాడటం వెనుక ఆంతర్యం ఏమిటో ఇప్పుడు అర్థం అయింది.

ఎంతో పవిత్రమైన యాదగిరిగుట్టలో చేపడుతున్న ఆధునీకరణలో భాగంగా అక్కడ నిర్మిస్తున్న స్థూపాలలో దేవతామూర్తులతో పాటు కెసిఆర్ సార్ బొమ్మను.. కార్ గుర్తును.. టిఆర్ఎస్ సర్కార్ గుర్తును చెక్కడం ద్వారా.. కేసీఆర్ తనను తాను మహారాజుగా ఊహించుకుంటున్నారు అని అర్థం అవుతోంది.

రాజులు, రాజ్యాలు కనుమరుగైన తర్వాత కూడా కెసిఆర్ గారు తన దొరతనాన్ని ప్రదర్శించాలనుకోవడం  ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ప్రతిపక్షాలు ఈ విషయంపై చేసే ప్రకటనలను కెసిఆర్ గారు రాజకీయ కోణంలో చూసి.. వాటిని లైట్ గా తీసుకునే ప్రమాదం ఉంది.

తిరుమలతో సమానంగా తెలంగాణలో యాదగిరిగుట్టను కూడా ఇక్కడి ప్రజలు ఎంతో పవిత్ర క్షేత్రంగా నమ్ముతారు. మరి అలాంటి పవిత్ర క్షేత్రాన్ని రాజకీయ ప్రచారానికి వాడుకుంటూ.. ఆలయ పవిత్రతను దెబ్బతీసే విధంగా కేసీఆర్ సర్కార్ వ్యవహరిస్తున్న నియంతృత్వ తీరుపై మఠాధిపతులు పీఠాధిపతులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ధర్మో రక్షతి రక్షితః అనే నానుడికి  తగ్గట్లు హైందవ ధర్మాన్ని కాపాడే పెద్దలు టిఆర్ఎస్ పాలకుల కు కనువిప్పు కలిగిస్తారని ఆశిస్తున్నాను" అని విజయశాంతి ఓ ప్రకటనలో విమర్శించారు. యాదాద్రి ఆలయాన్ని రాజకీయాలకు వాడుకుంటూ దాని పవిత్రతను దెబ్బ తీస్తున్నారని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ నాకు అన్నతో సమానం... పరాశక్తిలో వివాదం లేదు : శివకార్తికేయన్

జూమ్ కాల్‌లో బోరున విలపించిన యాంకర్ అనసూయ

బాక్సాఫీస్ వద్ద 'మన శంకరవరప్రసాద్ గారు' దూకుడు

ఒక వర్గానికి చెందిన అభిమానులు పరాశక్తిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : దర్శకురాలు సుధా కొంగరా

Anasuya: పోలీసులను ఆశ్రయించిన అనసూయ.. 42 మందిపై ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సరే, మీరు పిల్లల్ని పంపడంలేదుగా, మే జారుతాం: జర్రున జారుతున్న కోతులు (video)

అద్భుతమైన కళాత్మక వస్త్రశ్రేణితో ఈ సంక్రాంతి సంబరాలను జరుపుకోండి

దక్షిణ భారతదేశంలో విస్తరిస్తున్న గో కలర్స్, హైదరాబాద్‌ ఏఎస్ రావు నగర్‌లో కొత్త స్టోర్ ప్రారంభం

ఏ ఆహారం తింటే ఎముకలు పటిష్టంగా మారుతాయి?

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తమ కార్యకలాపాలను ప్రారంభించిన వీక్యురా రీస్కల్ప్ట్

తర్వాతి కథనం
Show comments