Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు తెలంగాణ పర్యటనకు వస్తున్న హోం మంత్రి అమిత్ షా

Webdunia
ఆదివారం, 23 ఏప్రియల్ 2023 (10:33 IST)
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం ఒక రోజు పర్యటన నిమిత్తం తెలంగాణాకు వస్తున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునే ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ముందుగా ఆదివారం సాయంత్రం 3.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. విమానాశ్రయానికి సమీపంలోని నోవాటెల్ హోటల్‌లో జరిగే ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో చేవెళ్లకు వెళ్లి బీజేపీ తెలంగాణ శాఖ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. 
 
సాయంత్రం 3.30 గంటలకు హైదరాబాద్ నగరానికి చేరుకునే ఆయన.. సాయంత్రం 3.50 గంటలకు నోవాటెల్ హోటల్‌కు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటల నుంచి 4.30 గంటల వరకు "ఆర్ఆర్ఆర్" సినిమా ఆస్కార్ విజేతలతో ఆయన తేనీటి విందులో పాల్గొంటారు. అక్కడ నుంచి 5.15 గంటలకు బయలుదేరి రోడ్డు మార్గంలో చేవెళ్లకు చేరుకుంటారు. ఆరు గంటలకు హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన చేవెళ్లకు చేరుకుని పార్లమెంటరీ ప్రవాస్ యోజన సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా సభ ఏర్పాటుచేయడంతో పాటు పార్టీలో కీలక నేతల చేరికలపై రాష్ట్ర నేతలు కసరత్తు చేస్తారు. 
 
తెలంగాణ రాష్ట్ అసెంబ్లీకి ఈ యేడాది ఆఖరులో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలని బీజేపీ గట్టి సంకల్పంతో ఉంది. ఇందులోభాగంగా ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలు తెలంగాణాపై ప్రత్యేక దృష్టిసారించారు. ఇందులోభాగంగా, ఈ నెల 8వ తేదీన ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనకు వచ్చిన విషయం తెల్సిందే. ఇపుడు అమిత్ షా వస్తున్నారు. ఇకపై వీరిద్దరూ ప్రతి నెలా పర్యటిస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అమిత్ షా కార్యక్రమాన్ని నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments