Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాగ్యనగరికి రానున్న హోం మంత్రి అమిత్ షా - రెండు రోజుల బస

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (19:58 IST)
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 16వ తేదీన హైదరాబాద్ నగరానికి రానున్నారు. ఈ పర్యటనలో ఆయన రెండు రోజుల పాటు నగరంలో బస చేయనున్నారు. ఆ మరుసటి రోజు అంటే సెప్టెంబరు 17వ తేదీన జరిగే తెలంగాణ విమోచన దినోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. ఈ వేడుకకు కేంద్ర ప్రభుత్వం తరపున అమిత్ షా హాజరవుతున్నారు. ఈ వేడుకలను కేంద్రం అధికారికంగా నిర్వహిస్తుంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే ఈ వేడుకలకు కేంద్ర ప్రభుత్వం తరపున అమిత్ షా హాజరుకానున్నారు. 
 
16వ తేదీన భాగ్యనగరికి చేరుకునే ఆయన ఆ రాత్రికి నగరంలో బస చేస్తారు. 17వ తేదీన విమోచన దినోత్సవం వేడుకలో పాల్గొంటారు. ఆ తర్వాత నగర బీజేపీ శాఖకు చెందిన పలువురు ప్రతినిధులతో భేటీ అవుతారు. ఈ సందర్భంగా పార్టీ పటిష్టతపై దృష్టిసారించిన అమిత్ షా.. నగర శాఖ ప్రతినిధులతోనూ ఇదే విషయంపై కీలక సలహాలు, సూచనలు ఇస్తారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments