భాగ్యనగరికి రానున్న హోం మంత్రి అమిత్ షా - రెండు రోజుల బస

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (19:58 IST)
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 16వ తేదీన హైదరాబాద్ నగరానికి రానున్నారు. ఈ పర్యటనలో ఆయన రెండు రోజుల పాటు నగరంలో బస చేయనున్నారు. ఆ మరుసటి రోజు అంటే సెప్టెంబరు 17వ తేదీన జరిగే తెలంగాణ విమోచన దినోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. ఈ వేడుకకు కేంద్ర ప్రభుత్వం తరపున అమిత్ షా హాజరవుతున్నారు. ఈ వేడుకలను కేంద్రం అధికారికంగా నిర్వహిస్తుంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే ఈ వేడుకలకు కేంద్ర ప్రభుత్వం తరపున అమిత్ షా హాజరుకానున్నారు. 
 
16వ తేదీన భాగ్యనగరికి చేరుకునే ఆయన ఆ రాత్రికి నగరంలో బస చేస్తారు. 17వ తేదీన విమోచన దినోత్సవం వేడుకలో పాల్గొంటారు. ఆ తర్వాత నగర బీజేపీ శాఖకు చెందిన పలువురు ప్రతినిధులతో భేటీ అవుతారు. ఈ సందర్భంగా పార్టీ పటిష్టతపై దృష్టిసారించిన అమిత్ షా.. నగర శాఖ ప్రతినిధులతోనూ ఇదే విషయంపై కీలక సలహాలు, సూచనలు ఇస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2 నెలలుగా చదువుకు ఫీజులు చెల్లించడం లేదు : కరిష్మా కపూర్ పిల్లలు

రాజమౌళి ప్రశంసలు తనకు దక్కిన గౌరవం : పృథ్విరాజ్ సుకుమారన్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments