Webdunia - Bharat's app for daily news and videos

Install App

పానీపూరి తినడానికి వెళ్తే.. వాగులో కొట్టుకుపోయారు.. చివరికి?

Webdunia
గురువారం, 15 అక్టోబరు 2020 (18:09 IST)
హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా వరదలు ఏర్పడ్డాయి. భారీగా వరద నీరు రోడ్డుపై రావడంతో నగరంలో ట్రాఫిక్ పూర్తిస్థాయిలో నిలిచిపోయింది. నగరంలో ఉన్న పెద్ద పెద్ద హోర్డింగులు కూలిపోగా వాహనాలు కొట్టుకుపోయాయి. అంతే కాక కొన్ని వందల చెట్లు నెలకొరిగాయి. అయితే నగరంలో గురువారం వర్షం ఎక్కువగా లేకపోవడంతో ఇప్పడిప్పుడే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి.
 
కాస్త వరదలు తగ్గుముఖం పట్టండంతో అబ్దుల్లాపూర్ మెట్టు మండలం ఇంజపూర్ వాగులో గురువారం ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే ఇద్దరు యువకులను తోరూరు గ్రామానికి చెందిన ప్రణయ్(19), ప్రదీప్ (16)లుగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ తోరూరు గ్రామం నుంచి ఇంజపూర్‌కు మంగళవారం సాయంత్రం పానీపూరి తినడానికి వెళుతుండగా ప్రణయ్, ప్రదీప్ వాగులో గల్లంతయ్యారు. అయితే గురువారం కాస్త వరదలు తగ్గుముఖం పట్టడంతో మృతదేహాల ఆచూకీ లభ్యమయింది. దీంతో స్థానికుల సహాయంతో మృతదేహాలను వెలికితీసిన పోలీసులు ఉస్మానియా మార్చురీకి తరలించారు.
 
ఇదిలా ఉంటే నాగోల్ బండ్లగూడా మల్లికార్జున నగర్‌లో కూడా ఓ దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. నగరంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు వరదలు ఎక్కువగా రావడంతో పోస్ట్ మాన్ సుందర్ రాజు కొట్టుకుపోయాడు.  

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments