ప్రజలకు వినోదాన్ని పంచుతాం, అనుమతివ్వండి: మంత్రి తలసానికి విజ్ఞప్తి

Webdunia
శనివారం, 2 మే 2020 (19:29 IST)
లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లలోనే ఉంటున్నారని, వారికి ఎంటర్టైన్మెంట్ అందించేందుకు గాను షూటింగ్‌లకు అనుమతులు ఇవ్వాలని పలు ఛానళ్ళ ప్రతినిధులు కోరారు. 
 
మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను స్టార్ మా బిజినెస్ హెడ్ అలోక్ జైన్, ఈ టీవీ సీఈఓ బాపినీడు, జీ తెలుగు బిజినెస్ హెడ్ అనురాధ గూడూర్, జెమిని టీవీ బిజినెస్ హెడ్ కె.సుబ్రహ్మణ్యం, తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ చైర్మన్ ప్రసాద్‌లు కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. 
 
టివి షూటింగ్‌లకు తక్కువ సంఖ్యలో సిబ్బంది అవసరం ఉంటుందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యవహరిస్తూ షూటింగ్‌లను నిర్వహిస్తామని వారు మంత్రికి వివరించారు. 
 
కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా అమలు చేస్తున్న లాక్ డౌన్ కారణంగా ప్రజలు బయటకు వెళ్ళలేకపోతున్నారని, వారికి ఎంటర్టైన్మెంట్ అందించేందుకు షూటింగ్‌లను నిర్వహించుకునేందుకు అనుమతులు ఇప్పించాలని వారు కోరారు. 
 
స్పందించిన మంత్రి ఈ నెల 5వ తేదీన ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే క్యాబినెట్ సమావేశం అనంతరం ఈ అంశంపై పరిశీలిస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్ర రాజం గొల్ల రామవ్వ

VD 14: రౌడీ ఫ్యాన్స్ ఆకలి తీర్చేలా వీడీ 14 సినిమా ఉంటుంది - రాహుల్ సంకృత్యన్

Anil Ravipudi: చిరంజీవి తో మరో సినిమా - రాజమౌళితో కంపారిజన్ లేదు : అనిల్ రావిపూడి

Yamini ER: ఇన్ఫ్లుయెన్సర్ యామిని ఈఆర్ హీరోయిన్ గా ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ

వరుణ్ సందేశ్ హీరోగా షగ్నశ్రీ వేణున్ దర్శకురాలిగా హలో ఇట్స్ మీ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

భోజనం చేసిన వెంటనే ఇవి తీసుకోరాదు, ఎందుకంటే?

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి పాటించాలి

తర్వాతి కథనం
Show comments