ఉక్రెయిన్ బాధితుల కోసం ఉచిత బస్సు సర్వీసులు

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (13:31 IST)
ఉక్రెయిన్‌ - రష్యా యుద్ధం కారణంగా స్వదేశానికి వస్తున్న బాధితుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు సర్వీసులను నడుపుతుంది. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునే విద్యార్థులు వారివారి స్వస్థలాలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్టు తెలిపింది. 
 
శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఎంబీబీఎస్, జేబీఎస్‌కు చేరుకున్న విద్యార్థులు గానీ, మార్గమధ్యంలోని ఎక్కివారు గానీ ఉచితంగా ప్రయాణించవచ్చని వెల్లడించింది. అయితే, తాము ఉక్రెయిన్ నుంచి వచ్చినట్టుగా తగిన ఆధారం చూపించాల్సివుంటుందని టీఎస్ఆర్టీసీ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. 
 
కాగా, ఉక్రెయిన్‌లో తీవ్ర ఇబ్బందులు పడుతున్న భారత పౌరులు, విద్యార్థులను ఆపరేషన్ గంగ పేరుతో స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాలను నడుపుతుంది. ఇందులోభాగంగా, ఇప్పటికే అనేక విమానాలు వివిధ ప్రాంతాలకు వచ్చాయి. ఉక్రెయిన్ సరిహద్దు దేశాలైన పోలాండ్, రొమేనియా వంటి దేశాల రాజధానుల నుంచి ఈ విమానాలను నడుపేలా కేంద్రం చర్యలు తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha, బోయ్ ఫ్రెండ్ రాజ్ నిడిమోరును కౌగలించుకుని సమంత రూత్ ప్రభు ఫోటో

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments