Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూచ్.. ఈడీ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదు : కల్వకుంట్ల కవిత

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (17:11 IST)
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీచేసినట్టు వైరల్ అవుతున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేని తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఈ వార్తల్లో రవ్వంత కూడా నిజం లేదని చెప్పారు. ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కామ్ ఇపుడు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ స్కామ్‌పై ఈడీ అధికారులు శుక్రవారం హైదరాబాద్, నెల్లూరులతో పాటు 40కి పైగా స్థానాల్లో సోదాలు చేశారు. ఈ సోదాలు జరిగిన గృహాల్లో కవిత వ్యక్తిగత ఆడిటర్ కూడా ఉన్నారని, అందువల్ల కవితకు కూడా ఈడీ అధికారులు ఆమె వ్యక్తిగత సహాయకుడి ద్వారా నోటీసులు జారీచేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు వైరల్ అయ్యాయి.
 
ప్రస్తుతం కరోనా వైరస్ సోకి హోం ఐసోలేషన్‌లో ఉన్న కవిత ఈ వార్తలపై స్పందించారు. ఈడీ నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని స్పష్టం చేశారు. తాను ఈ వాస్తవాన్ని వెల్లడించడం ద్వారా టీవీ ప్రేక్షకుల విలువైన సమయాన్ని ఆదా చేయాలనుకుంటున్నానని తెలిపారు. 
 
ఢిల్లీలో కూర్చుని దుష్ప్రచారం చేస్తున్న కొందరు వ్యక్తులు మీడియాను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేసే కంటే వాస్తవాలనే ప్రచారం చేస్తూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీడియా సంస్థలన్నింటిని కోరుతున్నానని కవిత హితవు పలికారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments