Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్కరి భిక్ష కాదు : కె.కవిత

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (17:17 IST)
తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్క భిక్ష కాదని, ప్రజా పోరాటానికి లభించిన విజయమని తెరాస ఎమ్మెల్సీ కె.కవిత అన్నారు. ఇటీవల మాజీ ప్రధాని, ఆయన కుటుంబంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. ఆ తర్వాత బీజేపీ - తెరాస నేతల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం సాగుతోంది. 
 
ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు కె.కవిత కౌంటరిచ్చారు. నాటి ఉద్యమ నాయకులు, సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజా పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల కాదు అని ఆమె వ్యాఖ్యానించారు. 
 
అహింసా మార్గంలో తెరాస పార్టీ అధినేత కేసీఆర్ చేపట్టిన పోరాటంలో ప్రజలంతా ఆయనతో కలిసి రావడం, ఆనాడు ప్రభుత్వంలో ఉన్న మీపై ఒత్తిడి పెరగడం వల్ల తెలంగాణ ఇచ్చారు కానీ అది ఎవరి భిక్షకాదని కవిత అన్నారు. దేశ మాజీ ప్రధానిని, ఆయన కుటుంబాన్ని అవమానకరంగా మాట్లాడుతుంటే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి అండగా సీఎం కేసీఆర్ నిలబడ్డారని, అది కేసీఆర్ స్థాయి, గొప్పతనం. దయచేసి ఇంకోసారి కేసీఆర్ గురించి రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్య చేసే ముందు ఆలోచించుకోవాలని ఎమ్మెల్సీ కవిత కౌంటరిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments